Webdunia - Bharat's app for daily news and videos

Install App

తెలంగాణ ప్రైవేటు ఆస్పత్రుల్లో కరోనా ధరలు ఇవే...

Webdunia
బుధవారం, 23 జూన్ 2021 (14:00 IST)
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. వచ్చే నెల ఒకటో తేదీ నుంచి సంపూర్ణ లాక్డౌన్ ఎత్తివేయనున్నారు. ఈ నేపథ్యంలో రాష్ట్రంలోని ప్రైవేటు ఆస్పత్రుల్లో కరోనా చికిత్స, పరీక్షలు గరిష్ట ధరలను రాష్ట్రప్రభుత్వం ఖరారు చేసింది. 
 
క‌రోనా బాధితుల నుంచి అందిన‌కాడికి దోచుకుంటున్న ప్రైవేటు ఆస్ప‌త్రుల దోపిడీకి తెలంగాణ ప్ర‌భుత్వం అడ్డుక‌ట్ట వేసేలా చర్యలు తీసుకుంది. ఈ మేర‌కు క‌రోనా చికిత్స ఛార్జీల‌పై వైద్యారోగ్య శాఖ జీవో 40 జారీ చేసింది.
 
సాధార‌ణ వార్డులో ఐసోలేష‌న్‌, ప‌రీక్ష‌ల‌కు రోజుకు గ‌రిష్టంగా రూ.4 వేలు, ఐసీయూ వార్డులో రోజుకు గ‌రిష్టంగా రూ.7,500 వ‌సూలు చేయాల‌ని ఉత్త‌ర్వుల్లో పేర్కొన్న‌ది. వెంటిలేట‌ర్‌తో కూడిన ఐసీయూ గ‌దికి రోజుకు గ‌రిష్టంగా రూ.9 వేలుగా ఖ‌రారు చేశారు. పీపీఈ కిట్ ధ‌ర రూ.273కు మించ‌రాద‌ని తెలిపింది. 
 
హెచ్ఆర్‌సీటీ రూ. 995, డిజిట‌ల్ ఎక్స్‌రే రూ.1300, ఐఎల్6 రూ.1300, డీ డైమ‌ర్ ప‌రీక్ష రూ.300, సీఆర్‌పీ రూ.500, ప్రొకాల్ సీతోసిన్ రూ.1400, ఫెరిటిన్ రూ.400, ఎల్ డీహెచ్ రూ.140గా ఖ‌రారు చేశారు. సాధార‌ణ అంబులెన్స్‌కు క‌నీస ఛార్జి రూ.2 వేలు, కిలోమీట‌ర్‌కు రూ.75, ఆక్సిజ‌న్ అంబులెన్స్‌కు క‌నీస ఛార్జి రూ.3 వేలు, కిలోమీట‌ర్‌కు రూ.125గా ఖ‌రారు చేశారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Allu Arjun: అల్లు అర్జున్, శిరీష్, కిరణ్ అబ్బవరం దుబాయ్‌ లాండ్ అయ్యారు

ఓనమ్ పండుగ శుభాకాంక్షలతో కిరణ్ అబ్బవరం K-ర్యాంప్ స్పెషల్ పోస్టర్

విజయ్ ఆంటోనీ.. భద్రకాళి నుంచి పవర్ ఫుల్ సాంగ్ జిల్ జిల్ రిలీజ్

ఓ.. చెలియా నుంచి చిరుగాలి.. పాటను విడుదల చేసిన మంచు మనోజ్

Tran: Aries..; ట్రాన్: ఏరీస్.. డిస్నీ నుండి కొత్త పోస్టర్, ట్రైలర్ విడుదల

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పచ్చి ఉల్లిపాయలు తినడం వల్ల కలిగే సైడ్ ఎఫెక్ట్స్ ఏంటి?

బీపీ వున్నవారు ఏమేమి తినకుండా వుండాలి?

ఆధునిక వాస్కులర్ సర్జరీ అవయవాలు, ప్రాణాలను ఎలా కాపాడుతుంది?

ఫ్లూ నుంచి రక్షణ కోసం ట్రైవాలెంట్ ఇన్ఫ్లుయెంజా వ్యాక్సిన్‌ను విడుదల చేసిన జైడస్ వాక్సిఫ్లూ

మొక్కజొన్నలో వున్న పోషకాలు ఏమిటో తెలుసా?

తర్వాతి కథనం
Show comments