Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

తెలంగాణాలో పెరుగుతున్న పగటి ఉష్ణోగ్రతలు

తెలంగాణాలో పెరుగుతున్న పగటి ఉష్ణోగ్రతలు
, మంగళవారం, 22 జూన్ 2021 (13:24 IST)
తెలంగాణ రాష్ట్రంలో పగటి ఉష్ణోగ్రతలు పెరిగిపోతున్నాయి. దీంతో రాత్రి పూట కనిష్ట ఉష్ణోగ్రత 26.6 డిగ్రీలకు చేరుకుంది. పైగా గాలిలో తమ 15 శాతానికి పడిపోయింది. 
 
ఇటీవల ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోకి రుతుపవనాలు తాకిన తొలి వారంలో తెలంగాణలో విస్తారంగా కురిశాయి. ఈ వర్షాలు ఆ తర్వాత కనుమరుగయ్యాయి. రాష్ట్రంపై పొడి మేఘాలు కమ్ముకోవడంతో క్రమంగా ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి. 
 
గాలిలో తేమ 15 శాతానికి పడిపోయింది. ఫలితంగా ఉక్కపోతలు మొదలయ్యాయి. పగటి ఉష్ణోగ్రతలు పెరుగుతుండడంతో రాత్రి పూట ఉష్ణోగ్రతలు కనిష్ట స్థాయికి చేరుకుంటున్నాయి. 
 
అదేసమయంలో నేటి నుంచి నాలుగు రోజులపాటు రాష్ట్రంలో వర్షాలు కురిసే అవకాశమే లేదని వాతావరణ శాఖ చెబుతోంది. దక్షిణ భారతదేశంలో మొదలైన రుతుపవనాలు ఉత్తర భారతదేశం వైపు వెళ్లిపోవడంతో అక్కడ వర్షాలు విస్తారంగా కురుస్తున్నాయి. 
 
అక్కడ తగ్గితే ఇక్కడ వర్షాలు పెరిగే అవకాశం ఉంటుందని వాతావరణశాఖ అధికారులు తెలిపారు. రుతుపవనాల కదలికలు తెలంగాణలో బలహీనంగా ఉన్నట్టు చెప్పారు. బంగాళాఖాతంలో ఎలాంటి మార్పులు లేవని, వాతావరణం సాధారణంగా ఉందని పేర్కొన్నారు.
 
కాగా, నల్గొండ జిల్లా నిడమానూరులో ఈ నెలలో అత్యంత గరిష్ఠ ఉష్ణోగ్రత నమోదైంది. నిన్న ఇక్కడ పగటి ఉష్ణోగ్రత 38.5 డిగ్రీలుగా ఉంది. మరో నాలుగైదు రోజులపాటు ఇలాంటి వాతావరణమే ఉండే అవకాశం ఉందని అధికారులు అంచనా వేశారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

దేశంలో భారీగా తగ్గినా కేసులు - 3 నెలలు తర్వాత 50 వేలకు దిగువకు...