భుజం ఎముకకు ఫ్రాక్చర్ అయింది.. అందుకే సెలవులో ఉన్నా : డీజీపీ మహేందర్ రెడ్డి

Webdunia
గురువారం, 3 మార్చి 2022 (14:40 IST)
తన గురించి తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (టీపీసీసీ) చీఫ్ రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను తెలంగాణ రాష్ట్ర డీజీపీ మహేందర్ రెడ్డి ఖండించారు. రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు అవాస్తమన్నారు. తనను రాష్ట్ర ప్రభుత్వం బలవంతంగా సెలవుపై పంపించిందంటూ రేవంత్ చేసిన ఆరోపణల్లో ఎంతమాత్రం నిజం లేదని చెప్పారు. 
 
ఇటీవల తాను ఇంట్లో జారిపడ్డానని, దీంతో భుజానికి గాయమైందన్నారు. ఈ కారణంగా మూడు చోట్ల ఫ్రాక్చర్ అయినట్టు ఎక్స్‌రే, సీటీ స్కాన్, ఎంఆర్ఐ రిపోర్టుల్లో తేలిందన్నారు. దీంతో భుజం కదలకుండా కట్టుకట్టారని తెలిపారు. పైగా, పూర్తిగా విశ్రాంతి తీసుకోవాలని వైద్యులు చూసించారని చెప్పారు. అందుకే ఫిబ్రవరి 18వ తేదీ నుంచి మార్చి 4వ తేదీ వరకు సెలవులో ఉన్నట్టు చెప్పారు. 
 
ఆ తర్వాత కూడా వైద్యుల సలహా మేరకే తాను విధుల్లో చేరేది లేనిది నిర్ణయం తీసుకుంటానని చెప్పారు. ప్రస్తుతం భుజానికి అవసరమైన వ్యాయామం, ఫిజియో థెరపీ చేయించుకుంటూ మందులను వాడుతున్నట్టు చెప్పారు. ఇలాంటి వాస్తవాలు తెలుసుకోకుండా ప్రభుత్వం తనను బలవంతంగా సెలవుపై పంపించిందని చెప్పడాన్ని ఖండిస్తున్నట్టు డీజీపీ మహేందర్ రెడ్డి తెలిపారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

షూటింగులో ప్రమాదం... హీరో రాజశేఖర్‌ కాలికి గాయాలు

Tarun Bhaskar: రీమేక్ అయినా ఓం శాంతి శాంతి శాంతిః సినిమాని లవ్ చేస్తారు : తరుణ్ భాస్కర్

ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించిన జూనియర్ ఎన్టీఆర్.. ఏం కష్టమొచ్చిందో?

Rana: చాయ్ షాట్స్ కంటెంట్, క్రియేటర్స్ పాపులర్ అవ్వాలని కోరుకుంటున్నా: రానా దగ్గుపాటి

Pawan Kalyan!: పవన్ కళ్యాణ్ తో పీపుల్ మీడియా ఫ్యాక్టరీ చిత్రం !

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

సులభంగా శరీర బరువును తగ్గించే మార్గాలు

winter health, శీతాకాలంలో ఉసిరి కాయలు ఎందుకు తినాలి?

Black Salt: నల్ల ఉప్పును తీసుకుంటే మహిళలకు ఏంటి లాభం?

61 ఏళ్ల రోగికి అరుదైన అకలేషియా కార్డియాకు POEM ప్రక్రియతో కొత్త జీవితం

ఎముక బలం కోసం రాగిజావ

తర్వాతి కథనం
Show comments