Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్రధాని మోడీ అడ్డాలో సీఎం కేసీఆర్.. భారీ స్వాగత ఏర్పాట్లు

Webdunia
గురువారం, 3 మార్చి 2022 (13:18 IST)
ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రాతినిథ్యం వహిస్తున్న వారణాసి నియోజకవర్గంలో తెలంగాణ ముఖ్యమంత్రి, తెరాస అధినేత కేసీఆర్ ఎన్నికల ప్రచారం చేపట్టనున్నారు. దీంతో సీఎం కేసీఆర్ ప్రయాణించే మార్గంలో భారీ ఫ్లెక్సీలు ఏర్పాటుచేశారు. ఈ నెల 7వ తేదీన ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ఏడో విడత ఎన్నికల ప్రచారం జరుగనుంది. ఇందులో బీజేపీ వ్యతిరేకంగా ప్రచారం చేసేందుకు సీఎం కేసీఆర్ వారణాసికి వెళ్లనున్నారు. దీంతో సీఎం కేసీఆర్‌కు స్వాగతం పలుకుతూ భారీ ఫ్లెక్సీలు, బ్యానర్లు వెలిశాయి. 
 
ఈ ఫ్లెక్సీల్లో సమాజ్‌వాదీ పార్టీ అధినేత అఖిలేష్ సింగ్ యాదవ్, ముఖ్యమంత్రులు మమతా బెనర్జీ, ఎంకే స్టాలిన్, ఉద్ధవ్ ఠాక్రే, మాజీ ప్రధాని దేవేగౌడ, మంత్రి కేటీఆర్, సినీ నటుడు ప్రకాష్ రాజ్ వంటి వారి ఫోటోలు ఉన్నాయి. "ఉత్తరప్రదేశ్ మీకు హార్థిక స్వాగతం పలుకుతోంది. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్, దేశ్ కా నేత కేసీఆర్ అని ఫ్లెక్సీలపై రాశారు. 
 
సీఎం కేసీఆర్ యూపీ ఎన్నికల ప్రచారం చేయడానికి కారణం లేకపోలేదు. ప్రధాని మోడీపై సీఎం కేసీఆర్ యుద్ధం ప్రకటించారు. ఇందుకోసం ఆయన ఢిల్లీలో మకాం వేశారు. ఈ క్రమంలో ఫెడరల్  ఫ్రంట్ చర్చలు ముమ్మరం చేశారు. ఇందులోభాగంగా, ఉత్రప్రదేశ్ రాష్ట్ర శాసనసభకు జరుగుతున్న ఎన్నికల ప్రచారంలో పాల్గొనబోతున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

NTR; అర్జున్ S/O వైజయంతి సినిమా ప్రీ రిలీజ్ కి తమ్ముడు వస్తాడు : కళ్యాణ్ రామ్

Raviteja: తు మేరా లవర్ అంటూ రవితేజ మాస్ జాతర సాంగ్ రాబోతోంది

తిరుమల శ్రీవారిని దర్శించుకున్న అర్జున్ సన్నాఫ్ వైజయంతి సినీ బృందం (video)

Tabu: పూరి జగన్నాథ్, విజయ్ సేతుపతి చిత్రంలో టబు ఎంట్రీ

యాదార్థ సంఘటనల ఆధారంగా ప్రేమకు జై సిద్ధమైంది

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఇవి తింటే చెడు కొవ్వు కరిగిపోతుంది

పాలలో దాల్చిన చెక్క పొడి.. పరగడుపున తాగితే ఇంత మేలు జరుగుతుందా?

మెడ నొప్పితో బాధపడుతున్నారా? వేడినీటితో స్నానం.. ఈ చిట్కాలు పాటిస్తే?

భారతదేశవ్యాప్తంగా సూట్లు, షేర్వానీలపై మేడ్ ఫర్ యు, స్టిచ్డ్ ఫర్ ఫ్రీ ఆఫర్‌ను పరిచయం చేసిన అరవింద్ స్టోర్

బీపీ వున్నవారు యాలుక్కాయను తింటే ఏమవుతుంది?

తర్వాతి కథనం
Show comments