Webdunia - Bharat's app for daily news and videos

Install App

తెలంగాణ రాష్ట్రం ఏ ఒక్కరి భిక్ష కాదు : కె.కవిత

Webdunia
సోమవారం, 14 ఫిబ్రవరి 2022 (17:17 IST)
తెలంగాణ రాష్ట్రం ఏ ఒక్క భిక్ష కాదని, ప్రజా పోరాటానికి లభించిన విజయమని తెరాస ఎమ్మెల్సీ కె.కవిత అన్నారు. ఇటీవల మాజీ ప్రధాని, ఆయన కుటుంబంపై అస్సాం ముఖ్యమంత్రి హిమంతా బిశ్వ శర్మ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలను తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ తీవ్రంగా తప్పుబట్టారు. ఆ తర్వాత బీజేపీ - తెరాస నేతల మధ్య తీవ్రస్థాయిలో మాటల యుద్ధం సాగుతోంది. 
 
ఈ క్రమంలో తెలంగాణ బీజేపీ ఇన్‌ఛార్జ్ మాణిక్యం ఠాగూర్ సీఎం కేసీఆర్‌ను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలకు కె.కవిత కౌంటరిచ్చారు. నాటి ఉద్యమ నాయకులు, సీఎం కేసీఆర్ నాయకత్వంలో ప్రజా పోరాటం ద్వారా తెలంగాణ రాష్ట్రం వచ్చింది కానీ ఎవరి దయాదాక్షిణ్యాల వల్ల కాదు అని ఆమె వ్యాఖ్యానించారు. 
 
అహింసా మార్గంలో తెరాస పార్టీ అధినేత కేసీఆర్ చేపట్టిన పోరాటంలో ప్రజలంతా ఆయనతో కలిసి రావడం, ఆనాడు ప్రభుత్వంలో ఉన్న మీపై ఒత్తిడి పెరగడం వల్ల తెలంగాణ ఇచ్చారు కానీ అది ఎవరి భిక్షకాదని కవిత అన్నారు. దేశ మాజీ ప్రధానిని, ఆయన కుటుంబాన్ని అవమానకరంగా మాట్లాడుతుంటే కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీకి అండగా సీఎం కేసీఆర్ నిలబడ్డారని, అది కేసీఆర్ స్థాయి, గొప్పతనం. దయచేసి ఇంకోసారి కేసీఆర్ గురించి రాజకీయ ప్రేరేపిత వ్యాఖ్య చేసే ముందు ఆలోచించుకోవాలని ఎమ్మెల్సీ కవిత కౌంటరిచ్చారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అహ్మదాబాద్ విమాన ప్రమాదం తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన సినీ ప్రముఖులు

కోఆర్డినేషన్ కమిటీ వేయడాన్ని అభినందిస్తున్నాం : డా.ప్రతాని రామకృష్ణ గౌడ్

Gopichand's 33: గోపీచంద్, సంకల్ప్ రెడ్డి కాంబినేషన్ లో హిస్టారికల్ ఫిల్మ్

Pawn kalyan: ఆర్థిక ఇబ్బందులు, ఓటీటీ రూల్స్ వల్లే హరిహరవీరలమల్లు ఆలస్యం అవుతుందా?

మంగ్లీ డ్రగ్ పార్టీలో మేం లేవంటున్న రచ్చ రవి, దివి వాద్య, కాసర్ల శ్యామ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తులసి టీ ఆరోగ్య ప్రయోజనాలు

గ్లాసెడు బీట్ రసం తాగితే కలిగే ప్రయోజనాలు

రోబోటిక్ సర్జరీలలో సరికొత్త మైలురాయి సాధించిన మెడికవర్ హాస్పిటల్స్

ఓరి వీడి లవ్ ప్రపొజల్ ఐడియా తగలెయ్య (video)

కొబ్బరి కల్లు తాగితే ఏం జరుగుతుందో తెలుసా?

తర్వాతి కథనం
Show comments