Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

నిర్మలమ్మగారు.. సూటిగా సుత్తిలేకుండా చెప్పండి.. కవిత ట్వీట్

నిర్మలమ్మగారు.. సూటిగా సుత్తిలేకుండా చెప్పండి.. కవిత ట్వీట్
, గురువారం, 3 ఫిబ్రవరి 2022 (12:21 IST)
కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌కు తెరాస ఎమ్మెల్సీ కె.కవిత ఘాటైన ట్వీట్ చేశారు. నిర్మలమ్మగారు... సూటిలేకుండా, సుత్తిలేకుండా సమాధానం చెప్పండి అంటూ ట్వీట్ చేశారు.
 
లాభాల్లో ఉన్న ఎల్ఐసీని ఎందుకు అమ్ముతున్నారు?.. దేశం కోసమా?.. దేశం అంటే మట్టి మాత్రమే కాదు.. ఎల్ఐసీ ఎమ్మితే ఉద్యోగాలు, రిజర్వేషన్లు కోల్పోయే బిడ్డల కుటుంబాల పరిస్థితి ఏమిటని ప్రశ్నించారు?. 
 
కాగా, ఇటీవల లోక్‌సభలో విత్తమంత్రి నిర్మలా సీతారామన్ సమర్పించిన 2022-23 వార్షిక బడ్జెట్‌లో దేశంలో అతిపెద్ద ప్రభుత్వ రంగ బీమా సంస్థగా ఉన్న భారతీయ బీమా సంస్థ (ఎల్.ఐ.సి)లో పబ్లిక్ ఇష్యూకు ప్రకటించనున్నట్టు ప్రకటించారు. 
 
దీనిపైనే ఎమ్మెల్సీ కవిత ట్వీట్ చేశారు. నిన్నటి వరకు నష్టాల్లో ఉన్న సంస్థలనే వదిలించుకుంటూ వస్తున్న కేంద్ర ప్రభుత్వం ఇపుడు లాభాల్లో ఉన్న సంస్థలను కూడా ప్రైవేటీకరణ చేసే దిశగా అడుగులు వేస్తుంది. ఇందులోభాగంగానే ఎల్ఐసీని పబ్లిక్ ఇష్యూలోకి తీసుకుని రానున్నట్టు తెలుస్తుంది.
 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

UPSC నోటిఫికేషన్ విడుదల: 861 పోస్టుల భర్తీ