Webdunia - Bharat's app for daily news and videos

Install App

దీక్షిత్ హత్య కేసు కిడ్నాపర్లు ఎన్‌కౌంటర్?

Webdunia
గురువారం, 22 అక్టోబరు 2020 (11:41 IST)
ఇటీవల మహబూబాబాద్‌లోని కృష్ణ కాలనీలో అపహరణకు గురైన దీక్షిత్ రెడ్డి (9)ని కిడ్నాపర్లు హత్య చేశారు. ఇటీవల తమ ఇంటి వద్ద ఆడుకుంటుండగా ఆ బాలుడిని కిడ్నాప్ చేసిన విషయం తెలిసిందే. దీంతో అతడి తల్లిదండ్రులు రంజిత్‌, వసంత పోలీసులకు ఫిర్యాదు చేయడంతో పది బృందాలుగా ఏర్పడిన పోలీసులు గాలించారు. 
 
కిడ్నాపర్లు టెక్నాలజీ వాడుతూ పోలీసులకు చిక్కకుండా వసంతకు ఫోన్లు చేసి డబ్బు డిమాండ్ చేశారు. కిడ్నాపర్లు ఇంటర్నెట్ ద్వారా ఫోన్ చేస్తుండటంతో వారిని ట్రేస్ చేయడం పోలీసులకు సాధ్యం కాలేదు. 
 
కిడ్నాప్ చేసిన దుండగులు వసంతను రూ.45 లక్షలు డిమాండ్ చేశారు. అయితే, ఆ డబ్బు తీసుకుని వెళ్లినప్పటికీ కిడ్నాపర్లు దాన్ని తీసుకోవడానికి రాలేదు. చివరకు బాలుడిని హత్య చేశారు. ఆ బాలుడి మృతదేహం గుట్టల్లో లభ్యమైనట్లు తెలిసింది.
 
ఇదిలావుండగా, దీక్షిత్‌ని హత్య చేసిన ఇద్దరు (కిడ్నాపర్ల) నిందితులను పోలీసులు ఎన్‌కౌంటర్ చేసినట్టు తెలుస్తోంది. ఈ కేసుకు సంబంధించి ముగ్గురు నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారిలో ఇద్దరు బాలుడికి సమీప బంధువులేనని సమాచారం. మరో ఇద్దరు బయటి వ్యక్తులుగా తెలుస్తోంది. అయితే, ఈ కేసులో ప్రధాన నిందితులిద్దరినీ పోలీసులు ఎన్‌కౌంటర్ చేసినట్టు వార్తలు వస్తున్నాయి. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Ramcharan: పెద్ది లో కొత్త లుక్ లో రామ్ చరణ్ ను చూపించనున్న స్టైలిస్ట్ ఆలీం హకీం

బరాబర్ ప్రేమిస్తా’ నుంచి పాట విడుదల చేసిన బన్నీ వాస్

లిటిల్ హార్ట్స్ మూవీలో లైవ్ లీగా చూపించారు : అనిల్ రావిపూడి

రిషబ్ శెట్టి మూవీ కాంతార చాప్టర్ 1 నుంచి గుల్షన్ దేవయ్య లుక్

కబడ్డీ బ్యాక్ డ్రాప్ లో అర్జున్ చక్రవర్తి లాంటి సినిమా రాలేదు : నిర్మాత శ్రీని గుబ్బల

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తెల్ల నువ్వులతో ఆరోగ్య ప్రయోజనాలు

కాలేయ సమస్యలను అడ్డుకునే తేనెలో ఊరబెట్టిన ఉసిరి

జీడి పప్పులో వున్న పోషకాలు ఏమిటి?

వయోజనుల కోసం 20-వాలెంట్ న్యుమోకాకల్ కాంజుగేట్ వ్యాక్సిన్‌ను ఆవిష్కరించిన ఫైజర్

మెడికవర్ క్యాన్సర్ ఇన్‌స్టిట్యూట్ ఉచిత క్యాన్సర్ నిర్ధారణ వైద్య శిబిరం

తర్వాతి కథనం
Show comments