Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
Friday, 11 April 2025
webdunia

నాయిని మరణం తెలంగాణ సమాజానికి తీరని లోటు: కేసీఆర్

Advertiesment
Nayini death
, గురువారం, 22 అక్టోబరు 2020 (09:34 IST)
కార్మిక నాయకుడు, తెలంగాణ ఉద్యమ నేత, మాజీ మంత్రి శ్రీ నాయని నరసింహా రెడ్డి ఇక లేరు. అనారోగ్యంతో అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న మాజీ హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి బుధవారం రాత్రి 12:25కు తుది శ్వాస విడిచారు. నాయిని మరణం టీఆర్ఎస్ పార్టీకి, తెలంగాణ సమాజానికి తీరని లోటని ముఖ్య మంత్రి కెసిఆర్ తన సంతాపం ప్రకటించారు.
 
ఐదు దశాబ్దాలుగా ప్రజల మనిషిగా ఆయన రాజకీయాల్లో, కార్మిక నేతగా పనిచేశారు. 1969 తెలంగాణ ఉద్యమంలో, 2001 నుండి మలిదశ తెలంగాణ ఉద్యమంలో వారి పాత్ర అనన్యసామాన్యమని పలువురు మంత్రులు కొనియాడారు. 

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో మూడు సార్లు అసెంబ్లీకి ఎన్నికయిన నాయిని వైయస్ కేబినెట్లో మంత్రిగా, తెలంగాణ ఏర్పాటు తర్వాత కేసీఆర్ క్యాబినెట్లో హోం మంత్రిగా బాధ్యతలు నిర్వహించారు. కార్మిక సంఘ నాయకుడిగా నాయిని నర్సింహారెడ్డి అందరికి సుపరిచితులు.
 
నల్గొండ జిల్లాకు చెందిన నాయిని 1960వ దశకంలో హైదరాబాద్ వచ్చి కార్మికుల హక్కుల పోరాటంతో కార్మిక నాయకుడిగా ఎదిగారు. 1978లో మొదటిసారి ఎమ్మెల్యేగా 1985, 2004లో ఉమ్మడి ఆంద్రప్రదేశ్ అసెంబ్లీకి ఎమ్మెల్యేగా, 2009లో తెలంగాణా నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

కరోనా టీకా తీసుకున్న వలంటీరు మృతి... ఎక్కడ?