ఓఆర్ఆర్‌లో బోల్తాపడిన థమ్స్‌అప్ లారీ... బాటిళ్ల కోసం ఎగబడిన జనం

Webdunia
బుధవారం, 20 ఏప్రియల్ 2022 (09:16 IST)
హైదరాబాద్ నగరంలోని ఓటర్ రింగ్ రోడ్డులో థమ్స్‌అప్ బాటిళ్లలోడుతో వెళుతున్న లారీ ఒకటి బోల్తా పడింది. ఈ విషయం తెలుసుకున్న స్థానికులు ఆ బాటిళ్ల కోసం పరుగులు తీశారు. 
 
రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్ మండలం, తారమతిపేట సమీపంలో ఈ ఘటన జరిగింది. థమ్స్‌అప్ బాటిళ్ల లోడుతో వెళుతున్నలారీ మంగళవారం రాత్రి 8 గంటల సమయంలో ప్రమాదవశాత్తు అదుపుతప్పి బోల్తాపడింది. ఈ విషయం తెలుసుకున్న స్థానికులు, చుట్టుపక్కల గ్రామాల వాసులు ఘటనా స్థలానికి చేరుకుని థమ్స్‌అప్ బాటిళ్ల కోసం ఎగబడ్డారు. ఈ ప్రమాదంలో లారీ డ్రైవల్, క్లీనర్‌కు స్వల్పంగా గాయాలయ్యాయి. 
 
మరోవైపు, ఆ మార్గంలో ప్రయాణిస్తున్నవారు కూడా తమ వాహనాలను ఆపి రోడ్డుపై పడిన థమ్స్‌అప్ బాటిళఅలను ఎత్తుకెళ్ళారే గానీ, గాయాలతో బాధపడుతున్న క్లీనర్, డ్రైవర్‌లను ఏమాత్రం పట్టించుకోలేదు. అయితే, ఈ ప్రమాదం గురించి సమాచారం అందుకున్న పోలీసులు మాత్రం ఘటనా స్థలానికి చేరుకుని క్షతగాత్రులను సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. ే

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఫ్యామిలీ అంతా హాయిగా నవ్వుకునేలా రాకాస ఉంటుంది : నిహారిక కొణిదెల

Amba’s Revenge: తెలుగులో తొలి ఏఐ సినిమా అంబ’s రివెంజ్

శ్రీనివాస మంగాపురం నుంచి స్వాతంత్ర బాబు గా డా. నరేష్ వికే

Ravi Basrur: కటాలన్ కు సలార్ ఫేం రవి బస్రూర్ మ్యూజిక్

Satya: సత్య, రియా సింఘా పై సత్య ఈజ్ నాట్ జెట్లీ ప్రమోషనల్ సాంగ్ రిలీజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

జింజిర్ వాటర్ అద్భుత ప్రయోజనాలు

ఎడిసన్ టౌన్‌షిప్‌లో నాట్స్ ఆధ్వర్యంలో కాఫీ విత్ కాప్స్: ప్రజా భద్రతపై అవగాహన సదస్సు

రాత్రి నిద్రకు ముందు తినకూడని ఆహార పదార్థాలు ఏమిటి?

టైఫాయిడ్ జ్వరం వచ్చినప్పుడు ఏమేమి తినకూడదు?

అసోసియేషన్ ఆఫ్ హెల్త్‌కేర్ ప్రొవైడర్స్-తమిళనాడు చాప్టర్ భాగస్వామ్యం

తర్వాతి కథనం
Show comments