Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

లారీ కిస్తీలు క‌ట్ట‌లేక‌పోతున్నాం... హరితపన్ను నిలిపివేయండి..

లారీ కిస్తీలు క‌ట్ట‌లేక‌పోతున్నాం... హరితపన్ను నిలిపివేయండి..
విజ‌య‌వాడ‌ , సోమవారం, 17 జనవరి 2022 (15:10 IST)
సీఎం జగన్​కు లారీ యజమానుల సంఘం లేఖ రాసింది. కొవిడ్ ఇబ్బందుల దృష్ట్యా హరిత పన్నుపై పునరాలోచన చేయాలని విజ్ఞప్తి చేసింది. తీవ్ర ఆర్థిక సంక్షోభంతో ఫైనాన్స్ కిస్తీలు కట్టలేకపోతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రంలోని గుంతలమయమైన రోడ్లను అభివృద్ధి చేయాలని కోరారు. కొవిడ్​తో తాము తీవ్ర కష్టాలు పడుతున్నందున రాష్ట్ర ప్రభుత్వం ఈ నెల నుంచి పెంచిన హరిత పన్ను వసూలును వెంటనే నిలిపివేయాలని లారీ యజమానులు.. రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు. ఈ మేరకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్​కు లారీ ఒనర్స్ అసోషియేషన్ లేఖ రాసింది. 
 
 
కొవిడ్ కారణంగా రాష్ట్రంలో రవాణా రంగం తీవ్ర ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటోందని లారీ యజమానులు.. సీఎం దృష్టికి తెచ్చారు. తీవ్ర మందగమనం ఉన్నందున రోజు వారి ఖర్చులను నిర్వహించడమూ కష్టమవుతోందని తెలిపారు. ఫైనాన్స్ కిస్తీలు కట్టలేకపోవడంతో వేల లారీలను ఫైనాన్స్ వారు స్వాధీనం చేసుకున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ పరిస్థితుల్లో దేశంలో ఎక్కడా లేని రీతిలో రాష్ట్ర ప్రభుత్వం హరిత పన్ను పెంచిందని పేర్కొన్నారు. వాహనాలను బట్టి 200 రూపాయల నుంచి 20 వేలకు పన్నులు వసూలు చేస్తున్నారని లేఖలో ప్రస్తావించారు. హరిత పన్ను పెంపు వల్ల లారీ యజమానులు తీవ్ర ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటున్నారని తెలిపారు. వెంటనే హరిత పన్ను వసూలును నిలుపుదల చేయాలని కోరారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

టీడీపీ నేత నారా లోకేశ్‌కు కరోనా పాజిటివ్