Webdunia - Bharat's app for daily news and videos

Install App

వరంగల్‌ రూరల్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం, ముగ్గురు యువకులు మృతి

Webdunia
శుక్రవారం, 14 ఫిబ్రవరి 2020 (13:30 IST)
వరంగల్ రూరల్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ముగ్గురు యువకులను ఆర్టీసీ బస్సు ఢీకొనడంతో అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయిన దుర్ఘటన పలువురిని కలిచివేసింది. వరంగల్‌ రూరల్ జిల్లా గీసుకొండ మండలం గంగదేవిపల్లి సమీపంలో గురువారం రాత్రి ఆర్టీసీ బస్సు ద్విచక్ర వాహనాన్ని ఢీకొని ముగ్గురు మృతి చెందిన ఘటన జరిగింది.
 
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం గంగదేవిపల్లి గ్రామానికి చెందిన ఇట్ల జగదీశ్‌(19), న్యాల నవీన్‌(20), జనగామ జిల్లా నర్మెట్ట మండలం మాన్‌సింగ్‌ తండాకు చెందిన లకావత్‌ గణేష్‌(21) ముగ్గురు ద్విచక్ర వాహనంపై వరంగల్‌ నుంచి గంగదేవిపల్లికి వెళుతున్నారు. 
 
ఈ క్రమంలో వారు ప్రయాణిస్తున్న ద్విచక్రవాహనం గంగదేవిపల్లి సమీపంలోకి రాగానే వెనుక నుంచి వచ్చిన ఆర్టీసీ బస్సు వారి వాహనాన్ని ఢీకొట్టింది. దీంతో వాహనంపై ఉన్న ముగ్గురు ప్రమాద స్థలంలోనే ప్రాణాలు కోల్పోయారు. పోలీసులు ఘటనస్థలానికి  చేరుకుని వివరాలు సేకరించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

పెళ్లిలో పెళ్లి టైటిల్ చాలా ఆసక్తికరంగా వుంది : తనికెళ్ళ భరణి

అందరికంటే ఎక్కువ రెమ్యునరేషన్ ఇచ్చేవారు : స్మృతి ఇరానీ

Anjali: అంజలి లీడ్ రోల్ లో డైరెక్టర్ రాజశేఖర్ రెడ్డి పులిచర్ల చిత్రం

అఖండ2 కి నందమూరి బాలకృష్ణ డబ్బింగ్ పూర్తి చేశారు

గర్భవతి అని తెలిసినా ఆ నిర్మాత వదిలిపెట్టలేదు : రాధిక ఆప్టే

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Heart attack: వర్షాకాలంలో గుండెపోటు ప్రమాదం ఎక్కువా?

కాలిఫోర్నియా బాదంతో ఆరోగ్యకరమైన రీతిలో రక్షా బంధన్‌ను వేడుక చేసుకోండి

కదంబ వృక్షం ఆరోగ్య ప్రయోజనాలు

పప్పు పూర్ణాలు ఆరోగ్య ప్రయోజనాలు

కౌగిలింత, ఆలింగనంతో అంత మంచిదా.. ప్రేమ, ఓదార్పు కోసం హగ్ చేసుకుంటే?

తర్వాతి కథనం
Show comments