Webdunia - Bharat's app for daily news and videos

Install App

నెలసరిలో ఉన్న విద్యార్థినులను గుర్తించేందుకు... ఆ ప్రిన్సిపాల్ ఏం చేశారంటే...

Webdunia
శుక్రవారం, 14 ఫిబ్రవరి 2020 (13:13 IST)
తమవద్దకు వచ్చే విద్యార్థులకు నాలుగు మంచి మాటలు చెప్పి.. విద్యాబుద్ధులు నేర్పి.. సమాజంలో మంచి పౌరులుగా తీర్చిదిద్దాల్సిన ఓ ప్రిన్సిపాల్... ఏకంగా విద్యార్థినులు పరువు మంటగలిపేలా ప్రవర్తించారు. ఎవరు నెలసరిలో ఉన్నారో తెలుసుకునేందుకు ఆ కళాశాల ప్రిన్సిపాల్.. బాలికలను బాత్రూమ్‌లోకి తీసుకెళ్లి పరీక్షించారు. ఈ ఘటన రాజస్థాన్ రాష్ట్రంలోని రాజ్‌కోట్‌లో వెలుగుచూసింది. ఈ ఘటన వైరల్ కావడంతో పూర్తిస్థాయి విచారణకు ఓ త్రిసభ్య కమిటీ ఏర్పాటైంది. 
 
ఈ వివరాలను పరిశీలిస్తే, గుజరాత్‌లోని భుజ్ ప్రాంతంలో ఓ మహిళా కాలేజీవుంది. కళాశాలలోని వంట గదిలో కొన్ని వాడిన శానిటరీ ప్యాడ్లు కనిపించాయి. వీటిని గమనించిన హాస్టల్ వార్డెన్.. విషయాన్ని ప్రిన్సిపాల్ దృష్టికి తీసుకెళ్లింది. ఈ మాట వినగానే ఆమెకు కట్టలు తెంచుకుంది. ఆగ్రహంతో ఊగిపోయారు. 
 
ఆ కాలేజీ నిబంధన మేరకు నెలసరిలో ఉన్న విద్యార్థినులు మిగతా స్టూడెంట్లతో కలవకూడదు. వంట గదిలోకిగానీ దేవుడి గదిలోకి కానీ ప్రవేశించకూడదు. అలాంటిది వంటగదిలో వాడేసిన శానిటరీ ప్యాడ్లు కనిపించడం ప్రిన్సిపాల్‌కు ఆగ్రహం కలిగించింది. 
 
పైగా, కాలేజీ నిబంధనను ఉల్లంఘించిన విద్యార్థిని ఎవరో గుర్తించాలని ఆమె భావించి, తొలుత తప్పు చేసింది ఎవరో చెప్పాలంటూ కోరింది. దీంతో ఇద్దరు విద్యార్థినులు ముందుకు వచ్చారు. అయినప్పటికీ ఆ ప్రిన్సిపాల్ ఆగ్రహం చల్లారలేదు. 
 
అంతే, 68 మంది విద్యార్థినులను ఒక్కొక్కరిగా పరీక్షించారు. ఒక్కో విద్యార్థినిని బాత్రూమ్‌కు తీసుకెళ్లిన మహిళా టీచర్లు వారి దుస్తులు తొలగించి మరీ పరీక్షించారు. ప్రిన్సిపాల్ ఎదురుగానే వారిని పరీక్షించారు. దీంతో బాధిత విద్యార్థినులు సిగ్గుతో కుంగిపోయారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

టాలీవుడ్‌లో విషాదం - నటుడు ఫిష్ వెంకట్ ఇకలేరు..

60 యేళ్ల వయసులో 30 యేళ్ల నటిని పెళ్ళాడిన తమిళ దర్శకుడు మృతి

Venu Swami: వేణు స్వామి పూజలు ఫలించలేదా? నిధి అగర్వాల్ ఏమందంటే....

రామ్ పోతినేని రాసిన ఆంధ్రా కింగ్ తాలూకా ఫస్ట్ సింగిల్ పాడిన అనిరుధ్ రవిచందర్

Anandi: బుర్రకథ కళాకారిణి గరివిడి లక్ష్మి పాత్రలో ఆనంది ఫస్ట్ లుక్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వాన చినుకులతో వచ్చేసాయ్ మొక్కజొన్న పొత్తులు, ఇవి తింటే?

జ్ఞాపక శక్తిని పెంచే ఆహార పదార్థాలు

Soap: కుటుంబ సభ్యులంతా ఒకే సబ్బును ఉపయోగిస్తున్నారా?

తులసిని నీటిలో మరిగించి ఆ కషాయాన్ని తాగితే?

వర్షాకాలంలో ఆయుర్వేద ఆహారం: మెరిసే చర్మాన్ని పొందడానికి నిపుణుల చిట్కాలు

తర్వాతి కథనం
Show comments