Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆరిన కంటిదీపాలు, ఇంట్లోని వంటింటి గోడ కూలి ముగ్గురు చిన్నారులు మృతి

Webdunia
శుక్రవారం, 28 ఫిబ్రవరి 2020 (11:48 IST)
ఆ ఇంటి కంటి దీపాలు ఆరిపోయాయి. హైదరాబాద్ మాంగార్ బస్తీలో నివాసముండే చిత్తు కాగితాలు ఏరుకుని జీవించే మీఠాలాల్, గబ్బర్‌లనే అన్నదమ్ములు తమ కుటుంబాలతో ఒకే ఇంట్లో నివాసముంటున్నారు. రాత్రి అన్నం తిన్నాక పిల్లలు ఇంట్లో నిద్రిస్తుండగా.. పెద్దలు ఇంటి ముందు కూర్చొని ఉన్నారు. వంటింటి గోడ ఫెళ్లుమంటూ ఒక్కసారిగా కుప్పకూలింది. 
 
ఈ ప్రమాదంలో అల్లారుముద్దుగా పెంచుకుంటున్న మీఠాలాల్ ముగ్గురు కుమార్తెలు ఆరేళ్ల రోష్ని, మూడేళ్ల సారిక, రెండు నెలల వయస్సున్న పావని అక్కడికక్కడే చనిపోగా.. గబ్బర్ కుమార్ మూడేళ్ల గీత తీవ్ర గాయాలపాలైంది. గోడ కింద శిథిలాల్లో చిక్కుకున్న ముగ్గురు చిన్నారుల మృతదేహాలను పోస్టుమార్టం కోసం ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. గాయపడ్డ మూడేళ్ల గీతకు చికిత్స కోసం ఆసుపత్రికి తరలించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Samantha: వెండితెరపై కనిపించి రెండేళ్లైంది.. మా ఇంటి బంగారంగా వస్తానుగా అంటోన్న సమంత

AR Murugadoss- శివకార్తికేయన్, ఏఆర్ మురుగదాస్ చిత్రం మదరాసి తాజా అప్ డేట్

చిరంజీవిని మీరు నా డెమి-గాడ్.. అంటున్న దర్శకుడు శ్రీకాంత్ ఓదెల

Chiranjeevi 158 - అక్టోబర్ లో చిరంజీవి 158వ చిత్రానికి దర్శకుడు బాబీ శ్రీకారం

Anjali : RB చౌదరి నిర్మాతగా విశాల్ 35 చిత్రంలో నటించనున్న అంజలి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

అల్లం టీ తాగితే అధిక బరువు తగ్గవచ్చా?

శక్తినిచ్చే ఖర్జూరం పాలు, మహిళలకు పవర్ బూస్టర్

అబోట్ నుంచి నిరంతర గ్లూకోజ్ రీడింగులు అలర్ట్‌లతో కూడిన నెక్స్ట్-జెన్ ఫ్రీస్టైల్ లిబ్రే 2 ప్లస్‌

ఈ ఆయుర్వేద సూపర్‌ఫుడ్‌లతో రుతుపవనాల వల్ల వచ్చే మొటిమలకు వీడ్కోలు చెప్పండి

తెల్ల నువ్వులతో ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments