Webdunia - Bharat's app for daily news and videos

Install App

భర్తను కసితీరా పొడిచి పొడిచి చంపిన భార్య, ఎందుకు?

Webdunia
సోమవారం, 7 సెప్టెంబరు 2020 (22:29 IST)
భర్తతో గొడవపడి అతడిని దారుణంగా పొడిచి చంపింది భార్య. హైదరాబాదు శివారులోని రాజేంద్రనగర్‌లో ఘటన చోటుచేసుకుంది. డెహ్రాడూన్‌కు చెందిన సబీనా రోషన్, విశాల్ దివాన్‌లు భార్యాభర్తలు. విశాల్ దివాన్ మేనేజర్‌గా పనిచేసి రిటైర్డ్ అయ్యాడు. సబీనాకు అప్పటికే ఒక వివాహం జరిగి విడాకులు తీసుకుంది. ఆమెకు 23 యేళ్ళ కుమార్తె ఉంది. భర్తతో విడాకుల అనంతరం విశాల్ దివాన్‌ను సబీనా రెండో వివాహం చేసుకుంది. వీరికి 12 యేళ్ళ కుమారుడు ఉన్నాడు.
 
అయితే గత కొంతకాలంగా వీరి మధ్య తరచూ గొడవలు జరుగుతూ ఉన్నాయి. నిన్న రాత్రి ఇద్దరిమధ్య తారాస్థాయిలో మనస్పర్థలు ఏర్పడి గొడవ జరిగింది. ఒకరిపై ఒకరు చేయిచేసుకున్నారు. దీంతో ఆగ్రహంతో ఊగిపోయిన భార్య వంటగదిలోని కత్తితో భర్త పొట్టలో పొడిచింది.
 
కిందపడినా అతడిని వదిలిపెట్టలేదు. పొట్టలో పొడుస్తూనే ఉంది. దీంతో అతను అపస్మారక స్థితిలోకి వెళ్ళిపోయాడు. తండ్రిని ఆ స్థితిలో చూసిన పిల్లలు గట్టిగా కేకలు వేస్తూ బయటకు పరుగులు తీశారు. స్థానికులు పోలీసులకు సమాచారం ఇవ్వగా ఘటనా స్థలానికి చేరుకుని నిందితురాలిని అదుపులోకి తీసుకున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

'దండోరా' కోసం వేశ్యగా మారిన బిందు మాధవి

Kalyan Ram: ఆమె ఫారెస్ట్ బురదలో రెండుగంటలున్నారు : డైరెక్టర్ ప్రదీప్ చిలుకూరి

Bindu Madhavi: దండోరా మూవీలో వేశ్య పాత్రలో బిందు మాధవి ఎంట్రీ

Raviteja: ఎ.ఐ. టెక్నాలజీతో చక్రి గాత్రంతో మాస్ జాతరలో తు మేరా లవర్ సాంగ్ రిలీజ్

Nani: నా నుంచి యాక్షన్ అంటే ఇష్టపడేవారు హిట్ 3 చూడండి : నాని

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

డ్రాగన్ ఫ్రూట్ తినడం వల్ల ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయా?

మెనోపాజ్ మహిళలకు మేలు చేసే శతావరి

ఇవి తింటే చెడు కొవ్వు కరిగిపోతుంది

పాలలో దాల్చిన చెక్క పొడి.. పరగడుపున తాగితే ఇంత మేలు జరుగుతుందా?

మెడ నొప్పితో బాధపడుతున్నారా? వేడినీటితో స్నానం.. ఈ చిట్కాలు పాటిస్తే?

తర్వాతి కథనం
Show comments