Webdunia - Bharat's app for daily news and videos

Install App

రంగారెడ్డి జిల్లాలో విషాదం... క్రికెట్ ఆడుతుండగా టెక్కీకి గుండెపోటు - మృతి

Webdunia
ఆదివారం, 7 మే 2023 (12:56 IST)
తెలంగాణ రాష్ట్రంలోని రంగారెడ్డి జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. క్రికెట్ ఆడుతూ ఓ సాఫ్ట్‌వేర్ ఉద్యోగికి గుండెపోటు వచ్చిది. దీంతో ఆయన తుదిశ్వాస విడిచాడు. రంగారెడ్డి జిల్లా కేసీఆర్ స్టేడియంలో విషాదకర ఘటన జరిగింది. మ్యాచ్ మధ్యలోనే వెన్ను నొప్పి రావడంతో బయటకువచ్చి కారులో పడుకుని విశ్రాంతి తీసుకుంటుండగా తుదిశ్వాస విడిచాడు. మృతుడిని ఏపీలోని ప్రకాశం జిల్లా మద్దిపాడు మండలం మల్లవరంకు చెందిన మణికంఠగా గుర్తించారు.
 
హైదరాబాద్ నగరంలోని ఓ సాఫ్ట్‌వేర్ కంపెనీలో పని చేసే మణికంఠ హైదరాబాద్ నగరంలోని కేపీహెచ్‌ బీలో ఓ హాస్టల్‌లో ఉంటున్నాడు. ఈయన తన స్నేహితులతో కలిసి క్రికెట్ ఆడుతుండగా ఈ విషాదకర ఘటన జరిగింది. దీనిపై మృతుని సోదరుడు వెంకటేశ్ స్పందిస్తూ, శనివారం ఉదయం రంగారెడ్డి జిల్లాలోని మహేశ్వరం మండలం ఘట్టుపల్లి శివారులోని కేసీఆర్ స్టేడియంలో మ్యాచ్ ఉందని వెళ్లాడని, మధ్యాహ్నం సోదరుడి స్నేహితుడు యశ్వంత్ తనకు ఫోన్ చేసి మణికంఠ చనిపోయాడని చెప్పాడన్నాడు. 
 
క్రికెట్ ఆడుతుండగా, వెన్నునొప్పి వచ్చిందని చెప్పి కారులో వెళ్లి పడుకున్నాడని, మ్యాచ్ అయిపోయిన తర్వాత పిలిచినా పలకకపోవడంతో ఆస్పత్రికి తీసుకెళ్లామని చెప్పాడు. అయితే, అప్పటికే మణికంఠ మరణించినట్టు వైద్యులు నిర్ధారించారని తెలిపారు. వెంకటేశ్ ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన పోలీసులు మణికంఠ మృతదేహానికి పోస్టుమార్టం చేసేందుకు ఆస్పత్రికి తరలించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మైసూర్ సబ్బుకు ప్రచారకర్తగా తమన్నా అవసరమా? కర్నాటకలో సెగ!!

Tamannah: మైసూర్ శాండల్ సోప్ అంబాసిడర్‌గా తమన్నా.. కన్నడ హీరోయిన్లు లేరా?

Mega Heros: మెగా హీరోలకు మనస్ఫూర్తిగా క్షమాపణ చెప్తున్నాను : విజయ్ కనకమేడల

Yash; రామాయణంలో రామ్‌గా రణబీర్ కపూర్, రావణ్‌గా యష్ షూటింగ్ కొనసాగుతోంది

Salman Khan: సల్మాన్ ఖాన్ ఇంటికి పిలిస్తేనే వచ్చాను.. పార్టీలో కలిశాను.. ఇషా

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Black Cumin Seed: నల్ల జీలకర్ర కషాయాన్ని మహిళలు తాగితే ఒబిసిటీ మటాష్

ఎసిడిటీని అడ్డుకునేందుకు 5 మార్గాలు

వేరుశనగ చిక్కీ ఆరోగ్య ప్రయోజనాలు

ఒకసారి లవంగం టీ తాగి చూడండి

ఎముక బలం తగ్గుతోందా? ఐతే ఇవి తినాలి

తర్వాతి కథనం
Show comments