Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

ముంచుకొస్తున్న మోచా తుఫాను.. ఆ రాష్ట్రాలకు అలెర్ట్

rain
, గురువారం, 4 మే 2023 (11:18 IST)
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలకు తుఫాను గండం పొంచివుంది. దీంతో వచ్చే ఐదు రోజుల పాటు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. విదర్భ నుంచి ఉత్తర తమిళనాడు మీదుగా ద్రోణి ఏర్పడివుందని, దీని ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో ఐదు రోజులు వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. 
 
ఈ నెల ఆరో తేదీన బంగాళాఖాతం ఆగ్నేయ దిశగలో తుఫాను ఏర్పడుతుందని భారత వాతావరణ కేంద్రం అంచనా వేసింది. దీనికి మోచాగా నామకరణం చేశారు. ఈ తుఫాను ఎనిమిదో తేదీ నాటికి బలహీనపడి అల్పపీడనంగా మారే అవకాశం ఉందని హెచ్చరించింది. దీని ప్రభావం కారణంగా ఒడిశా, ఏపీపై తీవ్ర ప్రభావం ఉండొచ్చని తెలిపింది. 
 
అలాగే, హైదరాబాద్ నగరంలోనూ వర్షం కురిసే అవకాశం ఉంది. దీంతో ఎల్లో అలెర్ట్ జారీ చేశారు. రెండో వారంలో బంగాళాఖాతంలో తుఫాను ఏర్పడే అవకాశం ఉందని, అమెరికా వాతావరణ కేంద్రం గ్లోబర్ ఫోర్‌కాస్ట్ సిస్టమ్, యూరోపియన్ సెంటర్ ఫర్ మీడియం రేంజ్ వెదర్ ఫోర్‌కాస్ట్‌ కేంద్రాలు అంచనా వేశాయి. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

క్రీడా వాహనాన్ని ఢీకొన్న ట్రక్కు.. చిన్నారులతో సహా 11 మంది మృతి