ఢిల్లీలో కొనసాగుతున్న రైజర్ల ఆందోళన... రైతులు మద్దతు

Webdunia
ఆదివారం, 7 మే 2023 (12:10 IST)
రెజ్లింగ్‌ ఫెడరేషన్‌ ఆఫ్‌ ఇండియా అధ్యక్షుడు, భాజపా ఎంపీ బ్రిజ్‌ భూషణ్‌ను ఆ పదవి నుంచి తొలగించాలని కోరుతూ రెజ్లర్లు చేపట్టిన ఆందోళనకు క్రమంగా మద్దతు పెరుగుతోంది. తాజాగా రెజ్లర్ల ఆందోళనకు రైతు సంఘం సంయుక్త కిసాన్‌ మోర్చా మద్దతు తెలిపింది. ఇందులోభాగంగా వారి ఆందోళనకు సంఘీభావం తెలియజేసేందుకు సంఘం నేతలు ఆదివారం ఢిల్లీకి పయనమయ్యారు. 
 
ఢిల్లీ సరిహద్దు రాష్ట్రాల నుంచి ఖాప్‌ పంచాయితీ నేతలు సైతం రెజ్లర్ల ఆందోళన స్థలికి బయల్దేరడంతో జంతర్‌ మంతర్‌తో పాటు ఢిల్లీ సరిహద్దుల్లో పోలీసులు భద్రతను కట్టుదిట్టం చేశారు. బ్రిజ్‌ భూషణ్‌ను తొలగించాలంటూ జంతర్‌ మంతర్‌ వద్ద గడిచిన 10 రోజులుగా రెజ్లర్లు ఆందోళన చేస్తున్న సంగతి తెలిసిందే. 
 
ఈ క్రమంలో ఆదివారం వారికి సంఘీభావం తెలిపేందుకు పంజాబ్‌, హర్యానా, ఢిల్లీ, ఉత్తరప్రదేశ్‌ రాష్ట్రాలకు చెందిన రైతు నేతలు దిల్లీకి బయల్దేరారు. ఈ క్రమంలోనే టిక్రి బోర్డర్‌ వద్ద రైతులను పోలీసులు అడ్డుకున్నారు. ప్రైవేటు వాహనాలకు మాత్రమే అనుమతిస్తామని, ట్రాక్టర్లకు అనుమతి లేదని తిప్పి పంపుతున్నారు.
 
మరోవైపు ఒకరోజు సంఘీభావం తెలియజేసేందుకు తాము ఢిల్లీ వెళుతున్నామని, ఒకవేళ ప్రభుత్వం సానుకూల నిర్ణయం తీసుకోకపోతే తమ తదుపరి కార్యాచరణను ప్రకటిస్తామని రైతు నేతలు ఈ సందర్భంగా తెలిపారు. మరోవైపు రెజ్లర్లకు మద్దతుగా దేశవ్యాప్త నిరసనలు చేపడతామని ఇప్పటికే సంయుక్త కిసాన్‌ మోర్చా పేర్కొంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Rashmika: గోండ్ తెగల బ్యాక్ డ్రాప్ లో రష్మిక మందన్న.. మైసా

Dil Raju: రామానాయుడు, శ్యామ్ ప్రసాద్ రెడ్డి ని స్ఫూర్తిగా తీసుకున్నా : దిల్ రాజు

Sharva : మోటార్ సైకిల్ రేసర్ గా శర్వా.. బైకర్ చిత్రం ఫస్ట్ లుక్

Chiranjeevi: సైకిళ్లపై స్కూల్ పిల్లలుతో సవారీ చేస్తూ మన శంకరవర ప్రసాద్ గారు

భవిష్యత్‌లో సన్యాసం స్వీకరిస్తా : పవన్ కళ్యాణ్ మాజీ సతీమణి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మిస్సోరీలో దిగ్విజయంగా నాట్స్ వాలీబాల్, త్రోబాల్ టోర్నమెంట్స్

మసాలా టీ తాగడం వలన కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏంటి?

ఆరోగ్యకరమైన కేశాల కోసం వాల్ నట్స్

స్వ డైమండ్స్ బ్రాండ్ అంబాసిడర్‌గా ప్రీతి జింటా

ప్రపంచ ఆర్థరైటిస్‌ దినోత్సవం: రుమటాయిడ్ ఆర్థరైటిస్‌ను ముందస్తుగా గుర్తించడం ఎందుకు ముఖ్యం?

తర్వాతి కథనం
Show comments