Webdunia - Bharat's app for daily news and videos

Install App

షర్మిల కొత్త పార్టీ : ఆమోదం తెలిపిన ఈసీ.. జూలైలో విధి విధానాలు...

Webdunia
శనివారం, 5 జూన్ 2021 (14:58 IST)
దివంగత ముఖ్యమంత్రి వైఎస్. రాజశేఖర్ రెడ్డి కుమార్తె వైఎస్. షర్మిల ఎట్టకేలకు రాజకీయ పార్టీని స్థాపించారు. వైఎస్ఆర్ తెలంగాణ పార్టీగా ఆమె తన పార్టీకి నామకరణం చేశారు. వైఎస్‌ఆర్ తెలంగాణ పార్టీ పేరుతో వాడుక రాజగోపాల్‌ కొత్త పార్టీ కోసం ఎన్నికల సంఘానికి దరఖాస్తు చేశారు. 
 
ఈ పేరుపై ఎవరికైనా అభ్యంతరాలుంటే తెలపాలని ఓ జాతీయ పత్రికలో ప్రకటన ఇచ్చారు. పార్టీ తరపున ఈసీకి వచ్చిన అప్లికేషన్ పరిశీలించిన తర్వాత ఎన్నికల సంఘం నిర్ణయం తీసుకోనుంది.
 
తెలంగాణలో వైఎస్ షర్మిల పెట్టబోయే పార్టీకి ఎన్నికల సంఘం ఈ గుర్తింపునిచ్చింది. పార్టీ పేరును వైఎస్సార్ తెలంగాణ పార్టీ (వైఎస్సార్ టీపీ)గా కేంద్ర ఎన్నికల సంఘం ఆమోదం తెలిపింది. వైఎస్సార్‌టీపీకి షర్మిల ప్రధాన అనుచరుడు వాడుక రాజగోపాల్‌ ఛైర్మన్‌గా వ్యవహరించనున్నారు.
 
ఇప్పటికే వైఎస్ షర్మిల తెలంగాణలో రాజకీయ పార్టీ పెడుతున్నట్లు ప్రకటించిన సంగతి తెలిసిందే. తండ్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి పుట్టిన రోజైన జూలై 8వ తేదీన ఆమె పార్టీ పేరును, జెండాను, సిద్ధాంతాన్ని ప్రకటించేందుకు వడివడిగా అడుగులు వేస్తున్నారు. 
 
అయితే, ఆమె పెట్టబోయే పార్టీ పేరు ఏంటనే చర్చ ఆసక్తికరంగా మారింది. తాజాగా వైఎస్ షర్మిల పెట్టబోయే పార్టీ పేరు బయటికి వచ్చింది. ఎన్నికల సంఘం వద్ద షర్మిల పార్టీ పేరును నమోదు చేయించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Sekhar Kammula: సరస్వతి దేవి తల ఎత్తుకొని చూసే సినిమా కుబేర : శేఖర్ కమ్ముల

రవితేజ, రిచా గంగోపాధ్యాయ్ బ్లాక్ బస్టర్ మిరపకాయ్ రీ రిలీజ్

ఫ్యామిలీ ఫెయిల్యూర్ స్టోరీ నేపథ్యంగా స:కుటుంబానాం చిత్రం

థియేట్రికల్ రిలీజ్ కు రెడీ అవుతున్న స్కై మూవీ

గడపగడపకు ఆర్కే నాయుడు నుంచి విక్రాంత్ ఐపీఎస్ గా మారా : ఆర్‌కె సాగర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

శరీరానికి శక్తినిచ్చే బాదం, రాగి మాల్ట్‌ ఇలా చేయాలి

ఈ పండ్లు తింటే శరీరానికి కావలసినంత ప్రోటీన్

మిట్రల్ రెగర్జిటేషన్ చికిత్స: దేశంలో ట్రాన్స్‌కాథెటర్-ఎడ్జ్-టు-ఎడ్జ్ రిపేర్ సిస్టం మైక్లిప్‌ను ప్రారంభించిన మెరిల్

మలాసనం వేసి గోరువెచ్చని మంచినీళ్లు తాగితే?

బిస్కెట్లు తింటే ఆకలి తీరుతుందేమో కానీ...

తర్వాతి కథనం
Show comments