Webdunia - Bharat's app for daily news and videos

Install App

రూ.కోట్లలో కోకాపేట భూములు - ఎకరం రూ.55 కోట్లు

Webdunia
శనివారం, 17 జులై 2021 (09:00 IST)
తెలంగాణ రాష్ట్రంలోని కోకాపేట భూముల ధర కోట్లాది రూపాయలు పలికింది. ఎకరం భూమి రూ.55 కోట్ల మేరకు అమ్ముడు పోయింది. దీన్నిబట్టే ఈ భూముల ధరలు ఏ విధంగా ఉన్నాయో ఇట్టే అర్థం చేసుకోవచ్చు. 
 
గత గురువరారం తెలంగాణ ప్రభుత్వం కోకాపేటలో 45 ఎకరాల ప్రభుత్వ భూములను వేలం వేసింది. అలాగే, శుక్రవారం ఖానామెట్‌లో భూములను వేలం వేసింది. ఈ మేరకు 15 ఎకరాల్లోని 5 ప్లాట్లకు వేలం నిర్వహించారు. 
 
అత్యధికంగా ఒక ఎకరం రూ.55 కోట్లు, సగటున ఒక్కో ఎకరం రూ.48.92 కోట్లు పలికింది. భూముల అమ్మకం ద్వారా ప్రభుత్వానికి రూ.729.41 కోట్ల ఆదాయం సమకూరింది. లింక్‌వెల్ టెలీ సిస్టమ్స్, జీవీపీఆర్ ఇంజినీర్స్, మంజీరా కన్‌స్ట్రక్షన్స్ కంపెనీలు భూములను దక్కించుకున్నాయి.
 
కాగా కోకాపేట, ఖానామెట్ భూముల వేలంతో తెలంగాణ ప్రభుత్వానికి రూ.2,729 కోట్ల ఆదాయం లభించడం విశేషం. కోకాపేట శివారులో త్వరలో ఐటీ హబ్ రానున్న సంగతి తెలిసిందే. దీంతో ఇక్కడ భూముల ధరలకు ఒక్కసారిగా రెక్కలు వచ్చాయి. పైగా, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుంచి తెలంగాణ వేరుపడిన తర్వాత అక్కడి భూముల ధరలు ఈ స్థాయిలో అమ్ముడు పోవడం ఇదే తొలిసారి కావడం గమనార్హం. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

తెలుగు, హిందీ భాషల్లో రాబోతోన్న సట్టముమ్ నీతియుమ్

ఏలుమలై నుంచి సిధ్ శ్రీరామ్ ఆలపించిన రా చిలకా మెలోడీ సాంగ్

Prabhas: ప్రభాస్ కొత్త లుక్ తో పూరి జగన్నాథ్, ఛార్మికి పలుకరింపు

మెగాస్టార్ చిరంజీవి తో డాన్స్ ఆనందంతోపాటు గౌరవంగా వుంది : మౌని రాయ్

కింగ్‌డమ్ విషయంలో పెద్ద ఛాలెంజ్ పరీక్షలో పాస్ అయ్యాము: సూర్యదేవర నాగ వంశీ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బొప్పాయి ఆరోగ్యానికి మంచిదే, కానీ వీరు తినకూడదు

కరివేపాకుతో చెడు కొవ్వు, రక్తపోటుకి చెక్

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

Snacks: బరువు తగ్గాలనుకునే మహిళలు హెల్దీ స్నాక్స్ తీసుకోవచ్చు.. ఎలాగంటే?

తర్వాతి కథనం
Show comments