Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆప్ఘన్‌లో చిక్కుకున్న తెలంగాణా వాసులు

Webdunia
బుధవారం, 18 ఆగస్టు 2021 (10:24 IST)
తాలిబన్ల వశమైన ఆఫ్గనిస్థాన్‌లో పలువురు తెలుగు ప్రజలు చిక్కుకున్నారు. ముఖ్యంగా తెలంగాణా వాసులు ఇక్కడ చిక్కుకునిపోయారు. వీరిని రాష్ట్రానికి తీసుకొచ్చేందు ప్రభుత్వాలు సహకరించాలని బాధితుల కటుంబాలు కోరుకున్నారు. 
 
ప్రస్తుతం ఆప్ఘాన్‌లో తెలంగాణవాసులు బొమ్మెన రాజన్న, వెంకటయ్య చిక్కుకున్నారు. తమతో పాటు మరో 14 మంది భారతీయులు  ఉన్నారని బాధితులు తెలిపారు. కేంద్ర ప్రభుత్వమే ఆదుకోవాలని కోరుతున్నారు.
 
తెలంగాణ రాష్ట్రంలోని మంచిర్యాలకు చెందిన బొమ్మెన రాజన్న.. 8 ఏళ్లుగా కాబుల్‌లోని ఏసీసీఎల్‌లో పనిచేస్తున్నారు. ఈ ఏడాది జూన్‌లో ఇంటికి వచ్చిన రాజన్న.. తిరిగి ఈ నెల 7న కాబుల్‌కు వెళ్లారు. 
 
అయితే, ఆఫ్ఘనిస్తాన్‌.. తాలిబన్ల ఆక్రమణకు గురి కావడంతో అక్కడి ప్రజలు ఇతర దేశాలకు పారిపోతున్నారు. ఈ క్రమంలో తెలుగు బాధితులు అక్కడ చిక్కుకున్నారు. దీంతో బాధితుల కుటుంబ సభ్యులు ఆందోళన చెందుతున్నారు. తమ వారిని స్వదేశానికి రప్పించాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతుఉన్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

NBK: బాలక్రిష్ణ పుట్టినరోజున అఖండ2 అప్ డేట్ రాబోతోంది

Rajendra Prasad: తన ఒరిజినల్ గెటప్ ఇదే అంటున్న రాజేంద్రప్రసాద్

Nikhil: నిఖిల్ కత్తి యోధుడిలా సంయుక్త విల్లు బాణంతో స్వయంభు లో యాక్షన్ సీన్

Sudheer: కృష్ణ కు నివాళితో జటాధర చిత్రం పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ ప్రారంభించిన సుధీర్ బాబు

శ్రీలీలకు నిశ్చితార్థం జరిగిపోయిందా? బిగ్ డే కమింగ్ సూన్ అంటూ ట్వీట్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

క్యారెట్ రసంలో తేనె కలిపి సేవిస్తే...

మింత్రా ఇవోఆర్ఎస్ 22వ ఎడిషన్ ఇప్పుడు 10 వేల బ్రాండ్ల నుంచి 4 మిలియన్లకు పైగా స్టైళ్లతో...

మునగ ఆకు పొడి ఆహారంలో భాగం చేసుకుంటే దుష్ప్రభావాలు వుంటాయా?

నేరేడు పండ్లు ఎందుకు తినాలో తెలుసా?

మామిడి పళ్లు తింటే ఆ అనారోగ్యాలు పరార్

తర్వాతి కథనం
Show comments