Webdunia - Bharat's app for daily news and videos

Install App

తెలంగాణలో పరువు హత్య.. సహ విద్యార్థితో మాట్లాడిన కూతుర్ని సజీవంగా?

తెలంగాణలో పరువు హత్య చోటుచేసుకుంది. తన కుమార్తె తనకు ఇష్టమొచ్చినట్లు తిరుగుతుందని.. చెప్పిన మాట వినట్లేదని తండ్రే ఆమె పాలిట యముడయ్యాడు. కన్నకూతురును సజీవదహనం చేశాడు. ఆమెది ఆత్మహత్య చిత్రీకరించాడు. అయి

Webdunia
బుధవారం, 20 సెప్టెంబరు 2017 (13:14 IST)
తెలంగాణలో పరువు హత్య చోటుచేసుకుంది. తన కుమార్తె తనకు ఇష్టమొచ్చినట్లు తిరుగుతుందని.. చెప్పిన మాట వినట్లేదని తండ్రే ఆమె పాలిట యముడయ్యాడు. కన్నకూతురును సజీవదహనం చేశాడు. ఆమెది ఆత్మహత్య చిత్రీకరించాడు. అయితే పోలీసులకు దొరికిపోయాడు. వివరాల్లోకి వెళితే.. ఏడో తరగతి చదివే అమ్మాయి పేరు రాధిక. ఆమె చదువుతో పాటు ఇతరత్రా పోటీల్లో మెరుగైన ప్రతిభను చూపేది. 
 
పాటలంటే ఆమెకు ప్రాణం. స్వరబద్ధంగా పాటలు పాడేది. అందుకు తగినట్లుగానే క్లాస్‌మేట్స్‌తో కలివిడిగా వుండేది. మంగళవారం పూట సహ విద్యార్థితో రాధిక మాట్లాడుతుండటాన్ని ఆమె తండ్రి నరసింహ చూశాడు. ఈ విషయంపై రాధికను నరసింహ నిలదీశాడు. అంతటితో ఆగకుండా నరసింహ రాధికపై చేజేసుకున్నాడు. రాధిక తలకు గాయం కావడంతో.. ఆపై తన భార్య లింగమ్మతో కలసి, రాధిక ఒంటిపై కిరోసిన్ పోసి తగులబెట్టారు. 
 
తన బిడ్డ ఆత్మహత్య చేసుకుందని చెప్పి దహన సంస్కారాలకు ఏర్పాట్లు చేశారు. అయితే, ఇరుగు పొరుగు వారు పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు వచ్చీ రావడంతోనే దీన్ని హత్యగా అనుమానించారు. తమదైన శైలిలో విచారించగా, తల్లిదండ్రులు నేరాన్ని అంగీకరించడంతో వారిని అరెస్ట్ చేశారు. తన కుమార్తె కుటుంబ పరువును గంగలో కలుపుతుందేమోననే ఆమెను హత్య చేశామని.. దీనికోసం తాము బాధపడట్లేదని నరసింహ తెలిపాడు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

శ్రీలీలకు నిశ్చితార్థం జరిగిపోయిందా? బిగ్ డే కమింగ్ సూన్ అంటూ ట్వీట్

కుమారుడు కోసం ఒక్కటైన మాజీ దంపతులు.. ఎవరు వారు?

Kalpika: మీ అమ్మ కడుపులో పుట్టావా.. నువ్వు అసలు ఆడదానివేనా? కల్పికపై రెచ్చిపోయిన? (video)

Natti: ఆర్.నారాయణమూర్తి కార్పొరేట్ శక్తుల్లో బందీ అయ్యారు : నట్టికుమార్ విమర్శ

మేఘాలు చెప్పిన ప్రేమ కథ లో నరేష్ అగస్త్య ఏమి చెబుతున్నారు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

క్యారెట్ రసంలో తేనె కలిపి సేవిస్తే...

మింత్రా ఇవోఆర్ఎస్ 22వ ఎడిషన్ ఇప్పుడు 10 వేల బ్రాండ్ల నుంచి 4 మిలియన్లకు పైగా స్టైళ్లతో...

మునగ ఆకు పొడి ఆహారంలో భాగం చేసుకుంటే దుష్ప్రభావాలు వుంటాయా?

నేరేడు పండ్లు ఎందుకు తినాలో తెలుసా?

మామిడి పళ్లు తింటే ఆ అనారోగ్యాలు పరార్

తర్వాతి కథనం
Show comments