Webdunia - Bharat's app for daily news and videos

Install App

సిమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాను పునరుద్ధరించాలి : మంత్రి కేటీఆర్

Webdunia
బుధవారం, 26 జనవరి 2022 (18:12 IST)
సిమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (సీసీఐ)ను పునరుద్ధరించేలా కేంద్ర ప్రభుత్వం ఒత్తిడి తెస్తామని తెలంగాణ రాష్ట్ర మంత్రి కేటీఆర్ వెల్లడించారు. బుధవారం ఆదిలాబాద్ జిల్లాకు చెందిన స్థానిక ఎమ్మెల్యే, మాజీ మంత్రి జోగు రామన్నతో పాటు ఆ జిల్లా నేతలతో ఆయన సమావేశమయ్యారు. ఈ సందర్భంగా సీసీఐను తిరిగి పునరుద్ధరించేందుకు చర్యలు తీసుకోవాలని వారంతా మంత్రిని కోరారు. 
 
ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ, సిమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా కంపెనీ పునఃప్రారంభంకోసం ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వం తరపున ఇప్పటికే అనేక ప్రయత్నాలు చేస్తున్నామని, ముఖ్యంగా, కేంద్రంపై ఒత్తిడి తెస్తున్నామని ఆయన తెలిపారు. 
 
సీసీఐ పునఃప్రారంభానికి అవసరమైన అన్ని రకాల ప్రత్యేక రాయితీలను ఇస్తామని, కొత్త కంపెనీ ఏర్పాటు చేస్తే ఎలాంటి రాయితీలు తెలంగాణ ప్రభుత్వం నుంచి అందుతాయో వాటిని సీసీఐకి అందించేందుకు సిద్ధంగా ఉన్నామంటూ మంత్రి కేటీఆర్ ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో అనేక పరిశ్రమలు ఏర్పాటు చేసి జిల్లాలో ఉపాధి అవకాశాల కల్పన కోసం అనేక ప్రయత్నాలు చేస్తున్నామని ఆయన వివరించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

బద్రీనాథ్‌లో ఐటమ్ గర్ల్‌కు గుడి లేదు.. గాడిద గుడ్డూ లేదు: పూజారులు

కమల్ హాసన్ థగ్ లైఫ్ నుంచి మొదటి సింగిల్ జింగుచా గ్రాండ్ రిలీజ్

హాస్పిటల్ నేపథ్యంలో డియర్ ఉమ రివ్యూ: సుమయ రెడ్డి అదరగొట్టింది..

పుష్ప-2 నుంచి పీలింగ్స్ పాటను అదరగొట్టిన ఆంధ్రా మహిళా (వీడియో)

అర్జున్ S/O వైజయంతి మూవీ రివ్యూ రిపోర్ట్... ఎలా వుందంటే?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

లెమన్ టీ ఆరోగ్య ప్రయోజనాలు

మహిళలు రోజువారీ ఆహారంలో అశ్వగంధను చేర్చుకోవడం మంచిదా?

కార్డియోమెటబాలిక్ ఆరోగ్యం, బరువు నిర్వహణకు బాదం పప్పులు

మెదడు పనితీరును పెంచే ఫుడ్

తల్లిదండ్రులు గుర్తించుకోవాలి... పిల్లల ముందు దుస్తులు మార్చుకోవద్దు..

తర్వాతి కథనం
Show comments