Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఏపీ సచివాలయంలో జెండా ఎగురవేసిన సిఎస్. సమీర్ శర్మ

Webdunia
బుధవారం, 26 జనవరి 2022 (18:09 IST)
గణతంత్ర దినోత్సవ వేడుకలు సందర్భంగా బుధవారం అమరావతి సచివాలయం మొదటి బ్లాకు వద్ద జరిగిన కార్యక్రమంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డా.సమీర్ శర్మ ముఖ్య అతిధిగా పాల్గొన్నారు.  పోలీసుల గౌరవ వందనాన్ని స్వీకరించి జాతిపిత మహాత్మాగాంధీ చిత్రపటానికి పూల మాలలు వేసి ఘణంగా నివాళులర్పించారు. అనంత‌రం జాతీయ జెండాను ఎగురవేశారు.


అనంతరం సిఎస్ డా.శర్మ మాట్లాడుతూ, భారత 73వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా రాష్ట్ర ప్రజలందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నట్టు చెప్పారు. రాజ్యాంగం దేశంలోని పౌరులందరికీ సమాన హక్కులు అవకాశాలు కల్పించిందని పేర్కొన్నారు. స్వాతంత్ర్య సమర యోధులు,రాజ్యాంగ నిర్మాత బిఆర్ అంబేద్కర్ సహా ఇతర ప్రముఖుల త్యాగాలను వారి కృషిని ప్రతి ఒక్కరూ మననం చేసుకోవాల్సిన తరుణమిదని సిఎస్ చెప్పారు.
 
 
గ‌త రెండేళ్ళుగా కరోనా పరిస్థితులు ఉన్నప్పటికీ ఆసమస్యలన్నిటినీ ప్రభుత్వం అధికమించి ప్రజలకు తగిన మెరుగైన సేవలు అందించేందుకు విశేష కృషి చేయడం జరుగుతోందని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డా.సమీర్ శర్మ పేర్కొన్నారు. ప్రభుత్వం అమలు చేస్తున్న వివిధ అభివృద్ధి సంక్షేమ పధకాలను గ్రామ స్థాయి వరకూ తీసుకువెళ్ళి సకాలంలో ప్రజలకు అందించేందుకు ప్రభుత్వ యంత్రాంగం ఎనలేని కృషి చేస్తోందని వారి సేవలను ప్రత్యేకంగా కొనియాడారు. రానున్న రోజుల్లో అధికారులు, సిబ్బంది మరింత చిత్తశుద్ది అంకిత భావాలతో పనిచేసి ప్రజలకు మరిన్ని మెరుగైన సేవలందించేందుకు కృషి చేయాలని సిఎస్ డా.సమీర్ శర్మ ఆకాంక్షించారు.
 
 
పలువురు చిన్నారులు, మహిళా సిబ్బంది తదితరులకు సిఎస్ డా.సమీర్ శర్మ మిఠాలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో సచివాలయం చీఫ్ సెక్యురిటీ అధికారి కృష్ణ మూర్తి, సచివాలయ అధికారులు, ఉద్యోగులు,పోలీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

గీతానంద్-మిత్రా శర్మ ప్రధాన పాత్రల్లో రొమాంటిక్ కామెడీ గా వస్తున్న వర్జిన్ బాయ్స్!

Nani: నాని, శ్రీనిధి శెట్టి లపై HIT: The 3rd Case నుంచి రొమాంటిక్ సాంగ్

శర్వానంద్, సంయుక్త లపై నారి నారి నడుమ మురారి ఫస్ట్ సింగిల్ వచ్చేసింది

NTR: ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ చిత్రం తాజా అప్ డేట్ - ఏప్రిల్ 22న సెట్స్‌లో ఎంట్రీ

కన్నప్ప రిలీజ్ డేట్ పోస్టర్‌ను విడుదల చేసిన యోగి ఆదిత్యనాథ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మెడ నొప్పితో బాధపడుతున్నారా? వేడినీటితో స్నానం.. ఈ చిట్కాలు పాటిస్తే?

భారతదేశవ్యాప్తంగా సూట్లు, షేర్వానీలపై మేడ్ ఫర్ యు, స్టిచ్డ్ ఫర్ ఫ్రీ ఆఫర్‌ను పరిచయం చేసిన అరవింద్ స్టోర్

బీపీ వున్నవారు యాలుక్కాయను తింటే ఏమవుతుంది?

ఉల్లిపాయ నూనె లేదా జ్యూస్ ఏది మంచిది?

కీరదోసను వేసవిలో ఎందుకు తినాలో తెలుసా?

తర్వాతి కథనం
Show comments