Webdunia - Bharat's app for daily news and videos

Install App

మే 8 నాటికి తెలంగాణా కరోనా ఫ్రీ స్టేట్ : కేటీఆర్ ఆశాభావం

Webdunia
గురువారం, 30 ఏప్రియల్ 2020 (09:20 IST)
మే 8వ తేదీ నాటికి తెలంగాణా కరోనా ఫ్రీ రాష్ట్రంగా అవతరిస్తుందన్న ఆశాభావాన్ని ఆ రాష్ట్ర మంత్రి కేటీఆర్ వ్యక్తం చేశారు. ఎందుకంటే.. గత కొన్ని రోజులుగా తెలంగాణ రాష్ట్రంలో నమోదవుతున్న కరోనా కేసులలో గణనీయమైన తగ్గుదల ఉందన్నారు. బుధవారం కూడా కేవలం ఏడు కేసులు మాత్రమే నమోదయ్యాయని గుర్తుచేశారు. 
 
ఇదే అంశంపై ఆయన మీడియాతో మాట్లాడుతూ, రాష్ట్రంలో కరోనా వైరస్ బారినపడుతున్న వారి సంఖ్య గణనీయంగా తగ్గిపోయిందన్నారు. పైగా, ఇప్పటికే ఈ వైరస్ బారినపడినవారంతా మే 7వ తేదీ లోపు డిశ్చార్జ్ కావొచ్చన్నారు. అందువల్ల మే 8వ తేదీ నాటికి తెలంగాణ కరోనా రహిత రాష్ట్రంగా ఆవిర్భవించవచ్చని ఆయన చెప్పుకొచ్చారు. 
 
కరోనా వైరస్ తర్వాత లగ్జరీ జీవితం కంటే.. ప్రజల ప్రాణాలు ఎంతో ముఖ్యమన్న విషయాన్ని ప్రతి ఒక్కరూ గుర్తించాలని చెప్పారు. అలాగే, కరోనా లాక్‌డౌన్ సమయంలోనూ రైతులను ఆదుకునేందుకు వీలుగా రాష్ట్ర వ్యాప్తంగా ఏకంగా ఏడు వేల ధాన్య సేకరణ కేంద్రాలను తెరిచివుంచినట్టు ఓ ప్రశ్నకు సమాధానమిచ్చారు. 

సంబంధిత వార్తలు

రేపటి నుండి పుష్పపుష్ప జపం చేస్తారంటూ తాజా అప్డేట్ ఇచ్చిన సుకుమార్

విరాజ్ అశ్విన్ క్లాప్ తో ఆర్ట్ మేకర్స్ చిత్రం ప్రారంభం

ఐవీఎఫ్ ద్వారా తల్లి కాబోతోన్న మెహ్రీన్...

డీప్ ఫేక్ వీడియో కేసు.. ముంబైకి వెళ్లిన రష్మిక మందన్న.. ఎందుకో తెలుసా?

ధర్మం కోసం యుద్ధం ప్రకటించిన హరిహర వీరమల్లు - తాజా అప్ డేట్

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

స్ట్రాబెర్రీలను తింటే కిడ్నీలకు కలిగే లాభాలు ఏమిటి? నష్టాలు ఏమిటి?

చిటికెడు ఉప్పు వేసిన మంచినీరు ఉదయాన్నే తాగితే ప్రయోజనాలు ఏంటి?

తర్వాతి కథనం
Show comments