Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

జన్‌ధన ఖాతాల్లోని సొమ్ము వెనక్కి... ఎవరికి.. ఎక్కడ?

జన్‌ధన ఖాతాల్లోని సొమ్ము వెనక్కి... ఎవరికి.. ఎక్కడ?
, బుధవారం, 29 ఏప్రియల్ 2020 (12:19 IST)
కరోనా లాక్‌డౌన్ కారణంగా బ్యాంకుల్లో జన్‌ధన్ ఖాతాలు కలిగిన వారికి నెలకు రూ.500 చొప్పున మూడు నెలల పాటు డబ్బులు జమ చేస్తామని కేంద్రం వెల్లడించింది. ఆ ప్రకారంగా తొలి విడత నగదు సొమ్మును ఏప్రిల్ మొదటి వారంలో జమ చేసింది. 
 
అయితే, చాలా మంది జన్‌ధన్ ఖాతాలు కలిగివున్నప్పటికీ వారిలో చాలా మంది పీఎంజీకేవై పథకం కింద ఈ సొమ్మును పొందేందుకు అర్హులుకాదని తేలింది. దీంతో ఆ సొమ్మును తెలంగాణ గ్రామీణ బ్యాంకు వెనక్కి తీసుకుంది. ఇలా మొత్తం రూ.16 కోట్లను వెనక్కి తీసుకుంది. 
 
కేంద్రం నిర్ణయం మేరకు.. పీఎంజీకేవై పథకం కింద తెలంగాణ రాష్ట్రంలో 473 తెలంగాణ గ్రామీణ బ్యాంకు శాఖల్లో ఖాతాలు కలిగివున్న సుమారు 9 లక్షల మందికి డబ్బులు జమయ్యాయి. వీరిలో 5,15,260 మంది మాత్రమే అర్హులని, మిగతా వారు అనర్హులని బ్యాంకు అధికారులు తేల్చారు. దీంతో అనర్హులకు ఖాతాల నుంచి డబ్బును వెనక్కి తీసుకుంది. 
 
అయితే, చాలా మంది డబ్బు పడిన వెంటనే డబ్బును విత్ డ్రా చేశారనీ, అలాంటి వారిని గుర్తించి, వారి నుంచి డబ్బును తిరిగి రాబట్టేందుకు చర్యలు చేపట్టినట్టు తెలంగాణ బ్యాంగు జనరల్ మేనేజర్ మహేశ్ తెలిపారు. ఆగస్టు ఒకటో తేదీ 2014 తర్వాత ప్రారంభించిన ఖాతాలు మాత్రమే అర్హమైనవన్న నిబంధనలు ఉన్నాయని వెల్లడించారు. తాము పొరపాటున నగదును జమ చేశామని, వారం తర్వాత దాన్ని గుర్తించామని తెలిపారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఏపీలో మరో 73 కరోనా కేసులు.. ఆరోగ్య మంత్రి పేషీ అటెండర్‌కు పాజిటివ్