Webdunia - Bharat's app for daily news and videos

Install App

స్నానం చేస్తుండగా వీడియో తీశాడు.. బ్లాక్ మెయిల్.. అత్యాచారం..

Webdunia
బుధవారం, 22 జులై 2020 (12:08 IST)
మహిళలపై అకృత్యాలు పెచ్చరిల్లిపోతున్నాయి. వయో బేధాలు లేకుండా వావివరుసలు లేకుండ అకృత్యాలు పెరిగిపోతున్నాయి. మహిళలపై దాడులు పెరిగిపోతున్నాయి. తాజాగా తెలంగాణలోని మంచిర్యాల జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. వివాహిత స్నానం చేస్తుండగా చాటుగా వీడియో తీసిన ఓ కామాంధుడు బ్లాక్‌మెయిల్ చేసి ఆమెపై లైంగిక దాడికి పాల్పడ్డాడు. ఈ ఘటన వేమనపల్లి మండలంలోని సూరారం గ్రామంలో జరిగింది. 
 
గ్రామానికి చెందిన రసపెల్లి మధు అనే యువకుడు స్థానికంగా ఉండే ఓ వివాహితపై కన్నేశాడు. ఆమె స్నానం చేస్తుండగా సెల్‌ఫోన్లో వీడియో తీసి వాటితో బ్లాక్‌మెయిల్ చేయడం ప్రారంభించాడు. తన కోరిక తీర్చకపోతే ఆ వీడియోలను సోషల్‌మీడియాలో పోస్ట్ చేస్తామని బెదిరించాడు. దీంతో పరువు పోతుందన్న భయంతో బాధితురాలు అతడికి లొంగిపోయింది. 
 
దీన్ని అవకాశంగా తీసుకుని ఆ కామాంధుడు అనేకమార్లు అత్యాచారానికి పాల్పడ్డాడు. అయినా వేధింపులు తాళలేకపోవడంతో బాధితురాలు తన భర్తకు ఈ విషయాన్ని చెప్పింది. దీంతో అతడు భార్యతో కలిసి పోలీస్‌స్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేశాడు. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

సంబంధిత వార్తలు

మ్యూజిక్ షాప్ మూర్తి నుంచి రాహుల్ సిప్లిగంజ్ పాడిన అంగ్రేజీ బీట్ లిరికల్ వచ్చేసింది

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఆహ్వానించిన దర్శకుల సంఘం

రోడ్డు ప్రమాదంలో పవిత్ర మృతి.. త్రినయని నటుడు చంద్రకాంత్ ఆత్మహత్య

రాహుల్ విజయ్, శివాని ల విద్య వాసుల అహం ఎలా ఉందంటే.. రివ్యూ

పాయల్ రాజ్‌ పుత్‌తో ప్రభాస్ పెళ్లి.. డార్లింగ్‌గా ఉంటాను?

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

ఈ పండ్లు, కూరగాయలు తిని చూడండి

మహిళలు రోజూ ఒక దానిమ్మను ఎందుకు తీసుకోవాలి?

‘కీప్ ప్లేయింగ్‘ పేరుతో బ్రాండ్ అంబాసిడర్ తాప్సీ పన్నుతో కలిసి వోగ్ ఐవేర్ క్యాంపెయిన్

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం