Webdunia - Bharat's app for daily news and videos

Install App

కొత్తగూడెంలో విషాదం.. పురుగుల మందు తాగిన ప్రేమజంట

Webdunia
మంగళవారం, 21 సెప్టెంబరు 2021 (11:27 IST)
తెలంగాణా రాష్ట్రంలోని భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఓ విషాదం చోటుచేసుకుంది. ఓ ప్రేమ జంట పురుగుల మందు సేవించింది. దీంతో అమ్మాయి ప్రాణాలు కోల్పోగా, అబ్బాయి ప్రాణాపాయ‌స్థితిలో ఆసుప‌త్రిలో చికిత్స పొందుతున్నాడు. ఈ ఘటన కొత్త‌గూడెం జిల్లా ఇల్లెందు మండ‌లం నెహ్రూన‌గ‌ర్‌లో జరిగింది. 
 
మృతురాలి పేరు బోడ శ్వేత‌(20)గా గుర్తించారు. ఆమె స్థానికంగా ఉండే ఓ కాలేజీలో డిగ్రీ చ‌దువుతోంది. కొన్నేళ్లుగా గుగులోత్ వెంక‌టేశ్ అనే యువ‌కుడిని ప్రేమిస్తోంద‌ని తెలుస్తోంది. వీరిద్దరూ పెళ్ళి చేసుకోవాలని భావించగా, అందుకు పెద్దలు సమ్మతించలేదు. దీంతో వారిద్దరూ పురుగుల మందు సేవించి ఆత్మహత్య చేసుకోవాలని భావించి, ఈ దారుణానికిపాల్పడ్డారు 
 
కాగా, పురుగుల మందు తాగిన యువ‌కుడి ప‌రిస్థితి విష‌మంగా ఉండటంతో స్థానిక ఆసుప‌త్రిలోని వైద్యులు చెప్ప‌డంతో అత‌డిని అక్క‌డికి మెరుగైన‌ చికిత్స అందించ‌డానికి ఖ‌మ్మం ఆసుప‌త్రికి తరలించారు. ఈ ఘ‌ట‌న‌పై కేసు న‌మోదు చేసుకున్న పోలీసులు ద‌ర్యాప్తు చేప‌ట్టారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

జీవితంలో నియమ నిబంధనలు నాకు అస్సలు నచ్చవ్ : సమంత

బెట్టింగ్ యాప్స్‌ను ప్రమోటింగ్ కేసు : విష్ణుప్రియకు షాకిచ్చిన తెలంగాణ హైకోర్టు

Kalyan ram: అర్జున్ S/O వైజయంతి లో కళ్యాణ్ రామ్ డాన్స్ చేసిన ఫస్ట్ సింగిల్

మీ చెల్లివి, తల్లివి వీడియోలు పెట్టుకుని చూడండి: నటి శ్రుతి నారాయణన్ షాకింగ్ కామెంట్స్

Modi: ప్రధానమంత్రి కార్యక్రమంలో ట్రెండీ లుక్‌ లో విజయ్ దేవరకొండ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయి తగ్గితే?

మనసే సుగంధం తలపే తీయందం

మెదడుకి అరుదైన వ్యాధి స్టోగ్రెన్స్ సిండ్రోమ్‌: విజయవాడలోని మణిపాల్ హాస్పిటల్ విజయవంతంగా చికిత్స

సాంబారులో వున్న పోషకాలు ఏమిటి?

30 ఏళ్లు పైబడిన మహిళలు తప్పనిసరిగా తినవలసిన పండ్లు

తర్వాతి కథనం
Show comments