Publish Date: Sat, 18 Sep 2021 (15:28 IST)
Updated Date: Sat, 18 Sep 2021 (15:33 IST)
తెలంగాణలో 19,20 తేదీల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఈ మేరకు హెచ్చరిక జారీ చేసింది. 20న కొమ్రంభీమ్ ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, పెద్దపల్లి, జయశంకర్ భూపాల్పల్లి, హన్మకొండ, జనగాం, సిద్దిపేట జిల్లాల్లో ఒకటి రెండు ప్రదేశాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరిక జారీ చేసింది.
ప్రస్తుతం రాష్ట్రంలో నైరుతి రుతుపవనాలు బలహీనంగా ఉన్నాయని తెలిపింది. గాలులు పశ్చిమ దిశ నుంచి వీస్తున్నాయని, దీని ప్రభావంతో రాగల 48 గంటల్లో ఆకాశం సాధారణంగా మేఘావృతమై ఉంటుంది. నగరంలోని పలు ప్రాంతాల్లో చిరుజల్లులు కురిసే అవకాశం ఉంది.
గడిచిన 24 గంటల్లో రాష్ట్రంలో 13 జిల్లాల్లో చిరుజల్లులు కురిశాయి. అత్యధికంగా కొమ్రంభీమ్ ఆసిఫాబాద్ జిల్లా చింతలమానుపల్లి మండలం రవీంద్ర నగర్లో 2.78, అదిలాబాద్ జిల్లా సిరికొండ 1.88, నార్నూర్ 1.63, జైనథ్ 1.55 సెంట మీటర్ల వర్షం నమోదైంది.