Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

రాజు మృతిపై జ్యూడీషియల్ విచారణకు హైకోర్టు ఆదేశం

Advertiesment
Telangana
, శుక్రవారం, 17 సెప్టెంబరు 2021 (17:17 IST)
హైదరాబాద్ నగరంలోని సైదాబాద్ సింగరేణి బస్తీకి చెందిన ఆరేళ్ళ చిన్నారిపై అత్యాచారం జరిపి హత్య చేసిన కేసులోని నిందితుడు రాజు ఆత్మహత్య కేసుపై తెలంగాణ రాష్ట్ర హైకోర్టు జ్యూడిషియల్ విచారణకు ఆదేశించింది. 
 
రాజుది ఆత్మహత్య కాదని.. కస్టోడియల్ మృతిగా అనుమానం ఉందని పౌర హక్కుల సంఘం అధ్యక్షుడు లక్ష్మణ్ పిల్ హైకోర్టులో లంచ్ మోషన్ పిల్ దాఖలు చేశారు. దీన్ని విచారణకు స్వీకరించిన కోర్టు... ఈ ఘటనపై విచారణ జరిపి నివేదిక సమర్పించాలని మేజిస్ట్రేట్‌కు హైకోర్టు ఆదేశించింది. 
 
ఈ విచారణ బాధ్యతలను వరంగల్ 3వ మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్‌కు అప్పగించింది. ఈ నివేదికను నాలుగు వారాల్లో సీల్డు కవర్‌లో నివేదిక సమర్పించాలని ఆదేశించింది.
 
ఈ పిటిషన్‌పై విచారణ సమయంలో ఆసక్తికరమైన వాదోపవాదాలు జరిగాయి. రాజును పోలీసులు హత్య చేసి ఆత్మహత్యగా చిత్రీకరించారని పిటిషనర్ పేర్కొన్నారు. కానీ,  అన్నారు. అయితే, రాజు ఆత్మహత్య చేసుకున్నాడని ఏజీ ప్రసాద్ తెలిపారు.  
 
ఏడుగురి సాక్ష్యాల నమోదు ప్రక్రియ వీడియా చిత్రీకరణ జరిగిందని చెప్పారు. పోస్టుమార్టం వీడియో చిత్రీకరణ జరిగినట్లు వివరించారు. వీడియోలు శనివారం రాత్రి 8లోగా వరంగల్ జిల్లా జడ్జికి అప్పగించాలని హైకోర్టు ఆదేశించింది.
 
మరోవైపు, రాజుది ముమ్మాటికీ ఆత్మహత్యేనని రాష్ట్ర డీజీవీ మహేందర్ రెడ్డి స్పష్టం చేస్తూ, ఈ అంశంపై ఇక రాద్దాంతం చేయొద్దని ఆయన కోరారు. ఈ నేపథ్యంలో హైకోర్టు విచారణకు ఆదేశించడం గమనార్హం. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ప్ర‌పంచ శాంతికి అతిపెద్ద విఘాతంగా రాడికలైజేషన్ : ప్రధాని మోడీ