Webdunia - Bharat's app for daily news and videos

Install App

చిరంజీవికి షాకిచ్చిన తెలంగాణ హైకోర్టు.. ఎందుకో తెలుసా?

Webdunia
బుధవారం, 15 మార్చి 2023 (09:37 IST)
మెగాస్టార్ చిరంజీవికి తెలంగాణ హైకోర్టు తేరుకోలేని షాకిచ్చింది. హైదరాబాద్ జూబ్లీహిల్స్‌లో జూబ్లీహిల్స్‌ సొసైటీ నుంచి 595 చదరపు గజాల స్థలాన్ని ఆయన కొనుగోలు చేశారు. ఇక్కడ నిర్మాణాలు చేసేందుకు ఆయన భూమి పూజా కూడా చేశారు. అయితే, ఆ భూమిని ప్రజా ప్రయోజనాల కోసం ఉద్దేశించిందనీ, అందువల్ల అక్కడ ఎలాంటి నిర్మాణాలు చేపట్టకుండా ఆదేశాలు ఇవ్వాలని కొందరు కోర్టును ఆశ్రయించారు. వీటిని విచారణకు స్వీకరించిన కోర్టు ఆ స్థలంలో ఎలాంటి నిర్మాణాలు చేపట్టవద్దంటూ తెలంగాణ హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీచేసింది. 
 
ప్రజా ఉపయోగం కోసం ఉద్దేశించిన 595 చదరపు గజాల స్థలాన్ని జూబ్లీహిల్స్ సొసైటీ చిరంజీవికి విక్రయించిందంటూ జె.శ్రీకాంత్ బాబు, మరికొందరు కలిసి హైకోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు. ఈ భూమిపై గ్రేటర్ హైదరాబాద్ మునిసిపల్ కార్పొరేషన్ (జీహెచ్ఎంసీ)కి నియంత్రణ లేకపోవడంతో నిబంధనలు ఉల్లంఘించి సొసైటీ దానిని చిరంజీవికి విక్రయించిందని పిటిషనర్లు ఆరోపించారు. 
 
కొనుగోలు చేసిన భూమిలో ఎలాంటి నిర్మాణాలు కూడా చేపట్టకుండా ఆదేశాలు ఇవ్వాలని ఆదేశించింది. ఈ పిటిషన్లపై ఇరు వర్గాల వాదనలు ఆలకించిన ధర్మాసనం కౌంటర్ అఫిడవిట్లు దాఖలు చేయాలని గ్రేటర్ హైదరాబాద్ నగర పాలక సంస్థ (జీహెచ్ఎంసీ), జూబ్లీహిల్స్ హౌసింగ్ సొసైటీని ఆదేశిస్తూ తదుపరి విచారణను ఏప్రిల్ 25వ తేదీకి వాయిదా వేసింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

గోమాతల్లో అయస్కాంత శక్తి ఉంది : పంజాబ్ గవర్నర్ గులాబ్ చంద్

సీత లేని ఇంటికి ఇప్పటివరకు వెళ్లలేదు : పార్తిబన్

Raj Tarun: ఏం బతుకురా నాది అంటున్న రాజ్ తరుణ్

ఇంటిల్లిపాదినీ నవ్వించే సారంగపాణి జాతకం సిద్ధం : నిర్మాత

Santosh Shobhan: సంతోష్ శోభన్ హీరోగా కపుల్ ఫ్రెండ్లీ షూటింగ్ కంప్లీట్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Banana: మహిళలు రోజూ ఓ అరటి పండు తీసుకుంటే.. అందం మీ సొంతం

అమెరికా తెలుగు సంబరాలు: తెలుగు రాష్ట్రాల సీఎంలకు నాట్స్ ఆహ్వానం

గర్భధారణ సమయంలో ఏయే పదార్థాలు తినకూడదు?

Pomegranate Juice: మహిళలూ.. బరువు స్పీడ్‌గా తగ్గాలంటే.. రోజూ గ్లాసుడు దానిమ్మ రసం తాగండి..

వేసవి వాతావరణంలో తాగవల్సిన పానీయాలు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments