Webdunia - Bharat's app for daily news and videos

Install App

తెలంగాణ అమరవీరులకు ఘన నివాళులు : గవర్నర్ తమిళిసై సౌందర్‌రాజన్

Webdunia
శుక్రవారం, 17 సెప్టెంబరు 2021 (14:15 IST)
సెప్టెంబరు 17వ తేదీన తెలంగాణ విమోచన దినోత్సవంగా భారతీయ జనతా పార్టీ తెలంగాణ శాఖ నిర్వహిస్తూ వస్తోంది. దీనిపై ఆ రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందర్ రాజన్ ఓ ప్రకటన చేశారు. సెప్టెంబర్ 17వ తేదీని విమోచన దినం జరుపుకోవాలంటూ ట్వీట్ చేశారు. ఈ సందర్భంగా తెలంగాణ ప్రజలకు ఆమె శుభాకాంక్షలు తెలిపారు. స్వాతంత్ర్య పోరాటంలో అత్యున్నత త్యాగాలు చేసిన అమరవీరులకు ఘనంగా నివాళులర్పించాలని అందరికీ విజ్ఞప్తి చేశారు. 
 
కాగా, భారతదేశానికి ఆగస్టు 1947లో స్వాతంత్ర్యం వచ్చినప్పటికీ తెలంగాణకు మాత్రం 1947 సెప్టెంబర్ 17న స్వాతంత్ర్యం వచ్చింది. అప్పటి నిజాం సర్కార్ నుంచి తెలంగాణను భారత్ దేశంలో విలీనం చేశారు. అయితే సెప్టెంబర్ 17పై రాజకీయంగా అనేక వివాదాలు నడుస్తున్నాయి. ఇది విమోచన దినోత్సవమా? విలీన దినోత్సవమా? లేక విద్రోహ దినోత్సవమా? అనే వివాదం నడుస్తోంది. 
 
బీజేపీ మాత్రం తెలంగాణ విమోచన దినోత్సవం సందర్భంగా నిర్మల్‌లో భారీ బహిరంగ సభ నిర్వహిస్తోంది. ఈ కార్యక్రమంలో కేంద్ర మంత్రి అమిత్ షా పాల్గొనబోతున్నారు. మరోవైపు టీఆర్ఎస్ మాత్రం ఈరోజు విలీన దినోత్సవమని, కాంగ్రెస్ పార్టీ కూడా విలీన దినోత్సవమని అంటోంది. బీజేపీ మాత్రం విమోచనదినంగా చెబుతోంది. ఇప్పుడు గవర్నర్ తమిళిసై చేసిన ట్వీట్ బీజేపీ నేతల హడావుడికి మద్దతు తెలిపినట్లుగా కనిపిస్తోంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Ramcharan: పెద్ది లో కొత్త లుక్ లో రామ్ చరణ్ ను చూపించనున్న స్టైలిస్ట్ ఆలీం హకీం

బరాబర్ ప్రేమిస్తా’ నుంచి పాట విడుదల చేసిన బన్నీ వాస్

లిటిల్ హార్ట్స్ మూవీలో లైవ్ లీగా చూపించారు : అనిల్ రావిపూడి

రిషబ్ శెట్టి మూవీ కాంతార చాప్టర్ 1 నుంచి గుల్షన్ దేవయ్య లుక్

కబడ్డీ బ్యాక్ డ్రాప్ లో అర్జున్ చక్రవర్తి లాంటి సినిమా రాలేదు : నిర్మాత శ్రీని గుబ్బల

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తెల్ల నువ్వులతో ఆరోగ్య ప్రయోజనాలు

కాలేయ సమస్యలను అడ్డుకునే తేనెలో ఊరబెట్టిన ఉసిరి

జీడి పప్పులో వున్న పోషకాలు ఏమిటి?

వయోజనుల కోసం 20-వాలెంట్ న్యుమోకాకల్ కాంజుగేట్ వ్యాక్సిన్‌ను ఆవిష్కరించిన ఫైజర్

మెడికవర్ క్యాన్సర్ ఇన్‌స్టిట్యూట్ ఉచిత క్యాన్సర్ నిర్ధారణ వైద్య శిబిరం

తర్వాతి కథనం
Show comments