Webdunia - Bharat's app for daily news and videos

Install App

తెలంగాణ గవర్నర్ కార్యక్రమాలు వాయిదా

Webdunia
సోమవారం, 16 మార్చి 2020 (08:12 IST)
కరోనా ప్రభావంతో రాజ్‌భవన్ వర్గాలు కీలక నిర్ణయం తీసుకున్నాయి. గవర్నర్‌కు సంబంధించిన అన్ని కార్యక్రమాలనూ వాయిదా వేస్తున్నట్లు ప్రకటించాయి.

ఇందుకు ప్రధాన కారణం.. కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ జారీ చేసిన సలహాయే. ప్రజలు సమూహాలుగా ఉండొద్దని ఆ శాఖ కోరింది. ఈ క్రమంలోనే రాజ్‌భవన్ వర్గాలు ఈ నిర్ణయం తీసుకున్నాయి. కేంద్రం తీసుకునే నిర్ణయాల ఆధారంగానే రాజ్‌భవన్ వర్గాలు తదుపరి సమావేశాల తేదీలు నిర్ణయిస్తాయని తెలిసింది.

మూడు వేల కోళ్లు పంపిణీ 
కరోనా ప్రభావంతో పౌల్ర్టీ రైతులు విలవిలలాడుతున్నారు. రెండు నెలలు కోళ్లను పెంచిన ఓ రైతు, అవి అమ్ముడు పోకపోవడంతో ఆదివారం ఉచితంగా పంపిణీ చేశాడు.

కరీంనగర్‌ జిల్లా హుజూరాబాద్‌ మండలం చెల్పూర్‌కు చెందిన రవీందర్‌ కోళ్లను అమ్మేందుకు మార్కెట్‌కు వెళ్లగా రూ.10కి ఒక కోడి కొనుగోలు చేస్తామని చికెన్‌ సెంటర్‌ నిర్వాహకులు చెప్పారు. దీంతో రవీందర్‌ గ్రామస్థులందరినీ పిలిచి తన పౌల్ర్టీ ఫాంలోని మూడు వేల కోళ్లను ఉచితంగా అందజేశాడు.

సంబంధిత వార్తలు

దేవర ఫియర్ సాంగ్ వర్సెస్ పుష్ప సాంగ్.. జరగండి అంటోన్న చెర్రీ

కనీసం నా పిల్లలతో చాక్లెట్ పార్టీకి కూడా తీరికలేదు, రేవ్ పార్టీనా?: జానీ మాస్టర్ - video

రేవ్ పార్టీలో పట్టుబడ్డ అతడెవరో నాలాగే వున్నాడు: శ్రీకాంత్ మేకా

అబ్బాయిలూ ఇలా అమ్మాయిలకు ప్రపోజ్ చేస్తే చెంపలు చెళ్లుమంటాయి

పాయల్ రాజ్‌పుత్ పైన రక్షణ నిర్మాత ఫిలిం ఛాంబర్‌కు ఫిర్యాదు

కిడ్నీలకు మేలు చేసే చింతచిగురు, ఇంకా ఎన్ని ప్రయోజనాలో తెలుసా?

శరీరంలో యూరిక్ యాసిడ్‌కు బైబై చెప్పాలంటే.. ఇవి వద్దే వద్దు..

ఈ 8 పండ్లను రాత్రి భోజనం చేసిన తర్వాత తీసుకోకూడదట

ఫోలిక్యులర్ లింఫోమా స్టేజ్ IV చికిత్సలో విజయవాడ అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ విశేషమైన విజయం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments