Webdunia - Bharat's app for daily news and videos

Install App

దసరా సెలవులు పొడిగింపు.. అంతా ఆర్టీసీ సమ్మె ఎఫెక్ట్

Webdunia
ఆదివారం, 13 అక్టోబరు 2019 (16:27 IST)
దసరా సెలవులను పొడిగించారు. ఈ మేరకు తెలంగాణ సర్కారు ఈ నిర్ణయం తీసుకుంది. ముందుగా అనుకున్న షెడ్యూల్ ప్రకారం.. ఈనెల 14న సోమవారం నుంచి స్కూళ్లు తెరుచుకోవాల్సి ఉంది.

అయితే, ఆర్టీసీ కార్మికులు సమ్మెను ఉధృతం చేసే క్రమంలో తమ భవిష్యత్ కార్యాచరణను ప్రకటించారు. దీంతో సర్కారు కూడా దసరా సెలవులను పొడిగిస్తూ నిర్ణయం తీసుకుంది.

దసరా సెలవులు అక్టోబర్ 19 (శనివారం) వరకు పొడిగించారు. ఇక ఆదివారం కూడా సెలవు కావడంతో అక్టోబర్ 21 నుంచి అంటే సోమనారం నాడు మళ్లీ పాఠశాలలు తెరుచుకోనున్నాయి. 
 
కాగా తెలంగాణలో ఆర్టీసిని విలీనం చేయాలంటూ కార్మికులు ఎనిమిది రోజులుగా సమ్మె చేస్తున్నారు. అయితే, ప్రభుత్వం మాత్రం.. సమ్మె చేస్తున్న వారు సెల్ఫ్ డిస్మిస్ అయిపోయినట్టేనని ప్రకటించింది.

ఈ క్రమంలో కార్మికులకు ప్రతిపక్షాలు మద్దతు పలికాయి. కార్మికులు కూడా తమ డిమాండ్లను సాధించే వరకు వదిలిపెట్టేది లేదని తేల్చేశాయి. ఈ క్రమంలో వారం రోజుల ఉద్యమ కార్యాచరణను ప్రకటించాయి. దీంతో దసరా సెలవులను పొడిగించినట్లు తెలంగాణ ప్రభుత్వం ప్రకటించింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

హాస్పిటల్ నేపథ్యంలో డియర్ ఉమ రివ్యూ: సుమయ రెడ్డి అదరగొట్టింది..

పుష్ప-2 నుంచి పీలింగ్స్ పాటను అదరగొట్టిన ఆంధ్రా మహిళా (వీడియో)

అర్జున్ S/O వైజయంతి మూవీ రివ్యూ రిపోర్ట్... ఎలా వుందంటే?

దక్షిణాదిలో గుడికట్టాలంటూ డిమాండ్ చేస్తున్న బాలీవుడ్ హీరోయిన్! (Video)

బాహుబలి 1 రికార్డ్.. స్పానిష్ భాషలో నెట్‌ఫ్లిక్స్ రిలీజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మెదడు పనితీరును పెంచే ఫుడ్

తల్లిదండ్రులు గుర్తించుకోవాలి... పిల్లల ముందు దుస్తులు మార్చుకోవద్దు..

రూ.49000 చెల్లిస్తే చాలు.. మహిళలు ఈజీగా నడిపే ఈవీ స్కూటర్ల వివరాలివే

వెర్టిగో గురించి ఈ సోషల్ మీడియా అధ్యయనం కీలక భావనలను వెల్లడిస్తుంది!

పచ్చి ఉల్లిపాయలు తింటే ఏమవుతుంది?

తర్వాతి కథనం
Show comments