Webdunia - Bharat's app for daily news and videos

Install App

చౌటుప్పల్‌లో ఘోర రోడ్డు ప్రమాదం : నలుగురి మృతి

Webdunia
గురువారం, 16 ఫిబ్రవరి 2023 (14:30 IST)
హైదరాబాద్ - విజయవాడ జాతీయ రహదారిపై గురువారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. అమిత వేగంతో దూసుకొచ్చిన ప్రైవేటు బస్సు ఒకటి ఆటోను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఆటోలో ఉన్న నలుగురు ప్రయాణికులు ప్రాణాలు కోల్పోయారు. మృతులంతా మహిళా కూలీలే కావడం గమనార్హం. ఈ ప్రమాదం కారణంగా భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. ప్రమాదం వార్త తెలుసుకున్న పోలీసులు.. అక్కడకు చేరుకుని వాహన రాకపోకలను క్రమబద్ధీకరించారు. కాగా, మృతదేహాలను పోలీసులు స్వాధీనం చేసుకుని ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. 
 
దండుమల్కాపురం ఇండస్ట్రియల్ పార్కు సమీపంలో ఈ ప్రమాదం జరిగింది. దేవలమ్మ నాగారం నుంచి వస్తున్న ఆటోను అబ్దుల్లాపూర్ మెట్ వెళుతున్న ప్రైవేటు బస్సు బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన వారిని 108 సిబ్బంది సాయంతో ఆస్పత్రి తరలించగా, అక్కడ చికిత్స పొందుతూ నలుగురూ మృత్యువాతపడ్డారు. చనిపోయినవారిని డాకోజి నాలక్ష్మి, వరకాంతం అనసూయ, సిలివేరు ధనలక్ష్మి, దేవరపల్లి శిరీష్‌లుగా గుర్తించారు. పోలీసులు కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు. 

సంబంధిత వార్తలు

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

సరికొత్త రొమాంటిక్ లవ్ స్టోరిగా సిల్క్ శారీ విడుదల సిద్ధమైంది

ఆనంద్ దేవరకొండ గం..గం..గణేశా ట్రైలర్ సిద్ధం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

తర్వాతి కథనం
Show comments