Webdunia - Bharat's app for daily news and videos

Install App

చౌటుప్పల్‌లో ఘోర రోడ్డు ప్రమాదం : నలుగురి మృతి

Webdunia
గురువారం, 16 ఫిబ్రవరి 2023 (14:30 IST)
హైదరాబాద్ - విజయవాడ జాతీయ రహదారిపై గురువారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. అమిత వేగంతో దూసుకొచ్చిన ప్రైవేటు బస్సు ఒకటి ఆటోను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఆటోలో ఉన్న నలుగురు ప్రయాణికులు ప్రాణాలు కోల్పోయారు. మృతులంతా మహిళా కూలీలే కావడం గమనార్హం. ఈ ప్రమాదం కారణంగా భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. ప్రమాదం వార్త తెలుసుకున్న పోలీసులు.. అక్కడకు చేరుకుని వాహన రాకపోకలను క్రమబద్ధీకరించారు. కాగా, మృతదేహాలను పోలీసులు స్వాధీనం చేసుకుని ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. 
 
దండుమల్కాపురం ఇండస్ట్రియల్ పార్కు సమీపంలో ఈ ప్రమాదం జరిగింది. దేవలమ్మ నాగారం నుంచి వస్తున్న ఆటోను అబ్దుల్లాపూర్ మెట్ వెళుతున్న ప్రైవేటు బస్సు బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన వారిని 108 సిబ్బంది సాయంతో ఆస్పత్రి తరలించగా, అక్కడ చికిత్స పొందుతూ నలుగురూ మృత్యువాతపడ్డారు. చనిపోయినవారిని డాకోజి నాలక్ష్మి, వరకాంతం అనసూయ, సిలివేరు ధనలక్ష్మి, దేవరపల్లి శిరీష్‌లుగా గుర్తించారు. పోలీసులు కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Varun Tej : మాల్దీవుల విహారయాత్ర లో వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి

NTR: వార్ 2 కోసం డబ్బింగ్ ప్రారంభించిన మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్

Mega157 : మెగాస్టార్ చిరంజీవి, నయనతార చిత్రం షెడ్యూల్ ఈరోజు ముస్సోరీలో ప్రారంభం

సింగర్‌ మంగ్లీపై డ్రగ్స్ కేసు? త్రిపుర రిసార్ట్‌లో అర్థరాత్రి దాకా డీజే హోరు!

Rashmika : కుబేర నుంచి రష్మిక మందన్న థర్డ్ సింగల్ పీ పీ డుమ్ డుమ్ సాంగ్ రిలీజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

గ్లాసెడు బీట్ రసం తాగితే కలిగే ప్రయోజనాలు

రోబోటిక్ సర్జరీలలో సరికొత్త మైలురాయి సాధించిన మెడికవర్ హాస్పిటల్స్

ఓరి వీడి లవ్ ప్రపొజల్ ఐడియా తగలెయ్య (video)

కొబ్బరి కల్లు తాగితే ఏం జరుగుతుందో తెలుసా?

శంఖం పువ్వులు ఆరోగ్యానికి చేసే మేలు ఏమిటి

తర్వాతి కథనం
Show comments