Webdunia - Bharat's app for daily news and videos

Install App

రాణి దుర్గావతి యూనివర్శిటీలో బాంబు దాడి - పేలని బాంబులు స్వాధీనం

Webdunia
గురువారం, 16 ఫిబ్రవరి 2023 (13:42 IST)
మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని జబల్‌పూర్‌లోని రాణి దుర్గావతి విశ్వవిద్యాలయంలో బాంబు దాడి జరిగింది. ముఖానికి ముసుగు ధరించి వచ్చిన ఓ దండుగుడు ఈ బాంబు దాడికి పాల్పడ్డాడు. అయితే, అదృష్టవశాత్తు ఈ రెండు బాంబులు పేలకపోవడంతో పెను విపత్తు తప్పింది. బుధవారం ఈ ఘటన జరిగింది. దీనికి సంబంధించిన వీడియో సీసీటీవీ కెమెరాల్లో రికార్డు అయింది. 
 
రాణి దుర్గావతి విశ్వవిద్యాలయం గేటు వద్దకు వచ్చిన ఓ వ్యక్తి వరుసగా రెండు బాంబులను ఒకదాని తర్వాత ఒకటి విసిరాడు. దీంతో ఆ ప్రాంతంలో పొగ కమ్ముకుంది. అక్కడున్న వాళ్ళు అతడిని పట్టుకునేందుకు ప్రయత్నించగా, వారి నుంచి తప్పించుకుని బైకుపై పారిపోయాడు. క్యాంటీన్ బయట ఈ దాడి జరిగింది. 
 
అదేసమయంలో ఈ దాడిలో ఎవరికీ ఎలాంటి గాయాలు కాలేదు. బాంబు దాడి వార్త తెలుసుకున్న పోలీసులు అక్కడకు చేరుకుని ఆ ప్రాంతాన్ని పరిశీలించారు. అక్కడ పేలకుండా ఉన్న రెండు బాంబులను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. 
 
దీనిపై స్థానిక పోలీస్ స్టేషన్ హౌస్ ఆఫీసర్ రమేష్ గౌరవ్ మాట్లాడుతూ, యూనివర్శిటీలోని క్యాంటీన్ బయట గుర్తు తెలియని వ్యక్ి బాంబులు విసిరినట్టు తమకు సమాచారం వచ్చింది. దీంతో అక్కడకు చేరుకుని దాడి జరిగిన ప్రాంతాన్నిపరిశీలించాం. ఈ దాడిలో ఎవరికీ గాయాలు కాలేదు. దీనిపై కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నాం" అని చెప్పారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

హాస్యం నుండి ప్రేమ వరకు, పులకరింతల నుండి కన్నీళ్ల వరకు

Rashmika: రశ్మిక మందన్న ది గర్ల్ ఫ్రెండ్ నుంచి లిరికల్ సాంగ్ రిలీజ్

సినిమా చేయాలంటే అన్ని వదిలేసుకుని రావాలి : రానా దగ్గుబాటి

ఆ గ్యాంగ్ రేపు 3 ఓటీటీలో స్ట్రీమింగ్‌ కానుంది

బాలీవుడ్ నటుడు అసిఫ్ ఖాన్‌కు గుండెపోటు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తులసిని నీటిలో మరిగించి ఆ కషాయాన్ని తాగితే?

వర్షాకాలంలో ఆయుర్వేద ఆహారం: మెరిసే చర్మాన్ని పొందడానికి నిపుణుల చిట్కాలు

స్లిమ్‌గా వున్నవారు లావయ్యేందుకు ఏం తినాలి?

ఆరోగ్యాన్ని కాపాడుకోవడం ఓ సవాలుగా మారింది, అందుకే

చేదుగా వుందని కాకరను వదలకండి.. బరువు తగ్గేందుకు డైట్‌లో చేర్చితే?

తర్వాతి కథనం
Show comments