Webdunia - Bharat's app for daily news and videos

Install App

రాణి దుర్గావతి యూనివర్శిటీలో బాంబు దాడి - పేలని బాంబులు స్వాధీనం

Webdunia
గురువారం, 16 ఫిబ్రవరి 2023 (13:42 IST)
మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని జబల్‌పూర్‌లోని రాణి దుర్గావతి విశ్వవిద్యాలయంలో బాంబు దాడి జరిగింది. ముఖానికి ముసుగు ధరించి వచ్చిన ఓ దండుగుడు ఈ బాంబు దాడికి పాల్పడ్డాడు. అయితే, అదృష్టవశాత్తు ఈ రెండు బాంబులు పేలకపోవడంతో పెను విపత్తు తప్పింది. బుధవారం ఈ ఘటన జరిగింది. దీనికి సంబంధించిన వీడియో సీసీటీవీ కెమెరాల్లో రికార్డు అయింది. 
 
రాణి దుర్గావతి విశ్వవిద్యాలయం గేటు వద్దకు వచ్చిన ఓ వ్యక్తి వరుసగా రెండు బాంబులను ఒకదాని తర్వాత ఒకటి విసిరాడు. దీంతో ఆ ప్రాంతంలో పొగ కమ్ముకుంది. అక్కడున్న వాళ్ళు అతడిని పట్టుకునేందుకు ప్రయత్నించగా, వారి నుంచి తప్పించుకుని బైకుపై పారిపోయాడు. క్యాంటీన్ బయట ఈ దాడి జరిగింది. 
 
అదేసమయంలో ఈ దాడిలో ఎవరికీ ఎలాంటి గాయాలు కాలేదు. బాంబు దాడి వార్త తెలుసుకున్న పోలీసులు అక్కడకు చేరుకుని ఆ ప్రాంతాన్ని పరిశీలించారు. అక్కడ పేలకుండా ఉన్న రెండు బాంబులను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. 
 
దీనిపై స్థానిక పోలీస్ స్టేషన్ హౌస్ ఆఫీసర్ రమేష్ గౌరవ్ మాట్లాడుతూ, యూనివర్శిటీలోని క్యాంటీన్ బయట గుర్తు తెలియని వ్యక్ి బాంబులు విసిరినట్టు తమకు సమాచారం వచ్చింది. దీంతో అక్కడకు చేరుకుని దాడి జరిగిన ప్రాంతాన్నిపరిశీలించాం. ఈ దాడిలో ఎవరికీ గాయాలు కాలేదు. దీనిపై కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నాం" అని చెప్పారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

వివాదాల నడుమ "ఎల్2 ఎంపురాన్" కలెక్షన్ల వర్షం : 4 రోజుల్లో రూ.200 కోట్లు

ఇంజనీర్ ఓ అమ్మాయి ప్రేమలో పడితే ఏమయిందంటే... ప్రదీప్ మాచిరాజు

Kalyan Ram: అమ్మల కోసం త్యాగం చేయాలి, అందుకే ఈ సినిమాని అమ్మలకు అంకితం : కళ్యాణ్ రామ్

పెళ్ళికి సిద్ధమవుతున్న చెన్నై చంద్రం?

అరుణాచలంలో ఆ హీరో - హీరోయిన్ చేసిన పనికి మండిపడుతున్న భక్తులు!!

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రాత్రి పడుకునే ముందు జాజికాయ నీరు తాగితే?

బెల్లీ ఫ్యాట్ కరిగిపోయి అధికబరువు తగ్గిపోవాలంటే?

దగ్గుతో రక్తం కక్కుకుంటున్నారు, రష్యాలో కొత్తరకం వైరస్, వేలల్లో రోగులు

అలాంటి వేరుశనక్కాయలు, ఎండుమిర్చి తింటే కేన్సర్ ప్రమాదం

Hot Water: వేసవిలో వేడి నీళ్లు తాగవచ్చా? ఇది ఆరోగ్యానికి మంచిదా?

తర్వాతి కథనం
Show comments