Webdunia - Bharat's app for daily news and videos

Install App

బీజేపీ టాటా చెప్పేసిన కన్నా లక్ష్మీనారాయణ

Webdunia
గురువారం, 16 ఫిబ్రవరి 2023 (13:20 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీకి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఆ పార్టీకి చెందిన సీనియర్ నేత, మాజీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ పార్టీకి రాజీనామా చేశారు. రాష్ట్ర నాయకత్వ తీరు ఏమాత్రం బాగోలేకపోవడంతో ఆయన తన నిరసనను వ్యక్తం చేస్తూ పార్టీకి రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించారు. 
 
ఇదే విషయంపై ఆయన గురువారం ఉదయం తన ముఖ్య అనుచరులతో సమావేశమయ్యారు. ఆ తర్వాత మీడియా సమావేశం ఏర్పాటు చేసి ఈ విషయాన్ని వెల్లడించారు. అయితే, కన్నా లక్ష్మీనారాయణ రాజీనామాపై ఆ పార్టీ రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ నరసింహారావు తప్పించుకునే ప్రయత్నం చేశారు. కన్నా రాజీనామాపై పార్టీ అధిష్టానం స్పందిస్తుందంటూ దాటవేశారు.
 
కాగా, గత 2014లో ప్రధాని నరేంద్ర మోడీ నాయకత్వం పట్ల ఆకర్షితులై బీజేపీలో చేరిన కన్నా... అప్పటి నుంచి పార్టీలో కొనసాగుతూ పార్టీ పటిష్టత కోసం కృషి చేస్తూ ఒక కార్యకర్తలా పని చేశారు. దీనికి ఫలితంగా ఆయన్ను గత 2018లో బీజేపీ రాష్ట్ర శాఖ అధ్యక్షుడిగా నియమించింది. 
 
కోవిడ్ మహమ్మారి తర్వాత ఆయన్ను తప్పించి పార్టీ నాయకత్వం బాధ్యతలను సోము వీర్రాజుకు అప్పగించారు. అప్పటి నుంచి రాష్ట్రంలో పగలు, కక్ష సాధింపు చర్యలపైనే పార్టీ నేతలు దృష్టిసారించారని ఆయన ఆరోపించారు. స్థానిక నాయకులకు డబ్బు సంపాదనే లక్ష్యంగా మారిందని, పార్టీని నమ్ముకున్న కార్యకర్తలను ఎవరూ పట్టించుకోవడం లేదని విమర్శించారు. ఈ పరిస్థితుల్లో పార్టీలో ఇమడ లేకే తాను పార్టీకి రాజీనామా చేస్తున్నట్టు ఆయన ప్రకటించారు. 

సంబంధిత వార్తలు

'కంగువ'లో 10,000 మంది పాల్గొనే వార్ సీక్వెన్స్

పెళ్లిపీటలెక్కనున్న హీరో ప్రభాస్.. ట్వీట్ చేసిన బాహుబలి!!

మహేష్ బాబు సినిమాపై ఆంగ్ల పత్రికలో వచ్చిన వార్తకు నిర్మాత కె.ఎల్. నారాయణ ఖండన

వీరభద్ర స్వామి ఆలయానికి జూనియర్ ఎన్టీఆర్ గుప్త విరాళం

అల్లు అర్జున్ ఆర్మీ అంత పనిచేసింది.. నాగబాబు ట్విట్టర్ డియాక్టివేట్

మహిళలు రోజూ ఒక దానిమ్మను ఎందుకు తీసుకోవాలి?

‘కీప్ ప్లేయింగ్‘ పేరుతో బ్రాండ్ అంబాసిడర్ తాప్సీ పన్నుతో కలిసి వోగ్ ఐవేర్ క్యాంపెయిన్

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

వేరుశనగ పల్లీలు ఎందుకు తినాలి?

టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

తర్వాతి కథనం
Show comments