Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

విరాళాలు అందుకోవడంలోనూ బీజేపీదే అగ్రస్థానం

bjp flags
, బుధవారం, 15 ఫిబ్రవరి 2023 (23:12 IST)
జాతీయ రాజకీయ పార్టీలకు విరాళాలు రావడం సామాన్యం. ఇలా జాతీయ పార్టీలకు లభిస్తున్న విరాళాల్లో బీజేపీ అగ్రస్థానాన్ని కైవసం చేసుకుంది. గత ఏడాది మొత్తం రూ.780.77 కోట్లు విరాళాల రూపంలో సమకూరగా, ఆ పార్టీకి ఏకంగా రూ.614.6 కోట్లు వచ్చాయి. 2020-21తో పోల్చితే బీజేపీ విరాళాల్లో 28.71 శాతం పెరుగుదలను నమోదు చేసుకుంది. 
 
ఎన్నికల సంఘానికి రాజకీయ పార్టీలు సమర్పించిన వివరాల అనుగుణంగా అసోసియేషన్‌ ఆఫ్‌ డెమొక్రాటిక్‌ రిఫార్మ్స్‌ సంస్థ జరిపిన అధ్యయనంలో ఈ వివరాలు తెలియవచ్చాయి. ఇక విరాళాల్లో రెండో స్థానంలో కాంగ్రెస్‌ ఉంది. ఆ పార్టీకి రూ.95.45 కోట్లు సమకూరాయి.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

అంజన్న క్షేత్ర అభివృద్ధికి అదనంగా రూ.500 కోట్లు: కేసీఆర్