Webdunia - Bharat's app for daily news and videos

Install App

తెలంగాణలో కరోనా విజృంభణ.. 337మందికి పాజిటివ్

Webdunia
సోమవారం, 22 మార్చి 2021 (11:34 IST)
తెలంగాణలో కరోనా కేసులు రోజు రోజుకీ పెరిగిపోతున్నాయి. ఆదివారం రాత్రి 8 గంటల వరకు 37,079 కరోనా టెస్టులు నిర్వహించగా 337 మందికి కరోనా సోకినట్టు బులెటిన్‌లో పేర్కొన్నారు. దీంతో తెలంగాణలో ఇప్పటి వరకు నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 3,03,455కి చేరింది. ఇందులో 2,98,826 మంది కోలుకొని డిశ్చార్జి కాగా 2,958 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి. 
 
ఇక కరోనాతో రాష్ట్రంలో ఇద్దరు మరణించారు. దీంతో తెలంగాణలో ఇప్పటి వరకు నమోదైన మొత్తం కరోనా మరణాల సంఖ్య 1671కి చేరింది. ముఖ్యంగా పాఠశాలలపై కరోనా కోరలు చాస్తోంది. రాష్ట్రవ్యాప్తంగా బడుల్లో పూర్తిస్థాయిలో తరగతులు నిర్వహిస్తున్న వేళ కరోనా వ్యాప్తి అంతకంతకూ పెరుగుతోంది. 
 
గణనీయమైన సంఖ్యలో విద్యార్థులు కొవిడ్‌ మహమ్మారి బారిన పడుతున్నారు. జ్వరం, జలుబు, దగ్గు తదితర లక్షణాలు విద్యార్థుల్లో కనిపిస్తున్నాయి. బడికి వెళ్లకపోతే హాజరు సమస్య .. వెళితే కరోనా భయం..ఈ రెండింటి మధ్య చిన్నారులు ఉక్కిరి బిక్కిరి అవుతున్నారు.

సంబంధిత వార్తలు

కోదండరామి రెడ్డి ఆవిష్కరించిన ఇట్లు... మీ సినిమా పోస్టర్

పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలలో సుమయా రెడ్డి‌ నటిస్తున్న డియర్ ఉమ

విక్రాంత్, చాందినీ చౌదరి జంటకు సంతాన ప్రాప్తిరస్తు

ఎందుకొచ్చిన గొడవ.. నా ట్వీట్‌ను తొలగించాను.. నాగబాబు

పవన్ కల్యాణ్‌పై షాకింగ్ కామెంట్స్ చేసిన రేణు దేశాయ్

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

ఈ పండ్లు, కూరగాయలు తిని చూడండి

మహిళలు రోజూ ఒక దానిమ్మను ఎందుకు తీసుకోవాలి?

‘కీప్ ప్లేయింగ్‘ పేరుతో బ్రాండ్ అంబాసిడర్ తాప్సీ పన్నుతో కలిసి వోగ్ ఐవేర్ క్యాంపెయిన్

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments