Webdunia - Bharat's app for daily news and videos

Install App

తెలంగాణా కాంగ్రెస్ సీనియర్ నేత వీహెచ్‌కు కరోనా పాజిటివ్

Webdunia
ఆదివారం, 21 జూన్ 2020 (09:11 IST)
తెలంగాణ ప్రాంతానికి కాంగ్రెస్ సీనియర్ నేత వి. హనుమంతరావు కరోనా వైరస్ బారిపడ్డారు. దీంతో ఆయన్ను హైదరాబాద్ నగరంలోని ప్రముఖ కార్పొరేట్ ఆస్పత్రిలో ఉంచి చికిత్స అందిస్తున్నారు. 
 
నిజానికి గత కొన్ని రోజులుగా తెలంగాణ రాష్ట్రంలో కరోనా వైరస్ విజృంభిస్తున్న విషయం తెల్సిందే. ముఖ్యంగా, గ్రేటర్ హైదరాబాద్ నగరంలో ఈ వైరస్ మరింత కరాళ నృత్యం చేస్తోంది. 
 
ఇప్పటికే పలువురు ప్రజా ప్రతినిధులు ఈ వైరస్ బారిపడ్డారు. తాజాగా కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత వి. హనుమంతరావు కరోనా వైరస్ చేతికి చిక్కారు. అస్వస్థతకు గురైన ఆయన అపోలో ఆస్పత్రిలో చేరారు. దీంతో వైద్యులు ఆయనకు కరోనా టెస్ట్ చేయగా పాజిటివ్ అని నిర్ధారణ అయ్యింది. దీంతో వీహెచ్ ప్రస్తుతం అపోలో ఆస్పత్రిలోనే చికిత్స పొందుతున్నారు. 
 
కాగా, అంతకు ముందు కాంగ్రెస్ పార్టీకి చెందిన మరో నేత గూడూరు నారాయణ రెడ్డికి కరోనా పాజిటివ్ వచ్చింది. ముగ్గురు టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, బీజేపీ మాజీ ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి కరోనా బారిన పడిన విషయం విధితమే. ఇలా వరుసగా ప్రజాప్రతినిధులు కరోనా బారిన పడుతుండటంతో మిగతా ప్రజాప్రతినిధుల్లో ఆందోళన మొదలైంది. 

సంబంధిత వార్తలు

రేపటి నుండి పుష్పపుష్ప జపం చేస్తారంటూ తాజా అప్డేట్ ఇచ్చిన సుకుమార్

విరాజ్ అశ్విన్ క్లాప్ తో ఆర్ట్ మేకర్స్ చిత్రం ప్రారంభం

ఐవీఎఫ్ ద్వారా తల్లి కాబోతోన్న మెహ్రీన్...

డీప్ ఫేక్ వీడియో కేసు.. ముంబైకి వెళ్లిన రష్మిక మందన్న.. ఎందుకో తెలుసా?

ధర్మం కోసం యుద్ధం ప్రకటించిన హరిహర వీరమల్లు - తాజా అప్ డేట్

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

స్ట్రాబెర్రీలను తింటే కిడ్నీలకు కలిగే లాభాలు ఏమిటి? నష్టాలు ఏమిటి?

చిటికెడు ఉప్పు వేసిన మంచినీరు ఉదయాన్నే తాగితే ప్రయోజనాలు ఏంటి?

తర్వాతి కథనం
Show comments