Webdunia - Bharat's app for daily news and videos

Install App

సీఎం కేసీఆర్‌కు వార్నింగ్ ఇచ్చిన కాంగ్రెస్ నేతలు

Webdunia
శుక్రవారం, 4 ఫిబ్రవరి 2022 (14:00 IST)
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్‌కు ఆ రాష్ట్రానికి చెందిన కాంగ్రెస్ నేతలు కూడా గట్టి వార్నింగ్ ఇచ్చారు. భారత రాజ్యాంగాన్ని తిరగరాయాలంటూ సీఎం కేసీఆర్ చేసిన ప్రకటనను వెనక్కి తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు. 
 
తాజాగా కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత వి.హనుమంత రావు మాట్లాడుతూ. ముఖ్యమంత్రి దళిత బంధు పథకాన్ని ప్రవేశపెట్టారు. ప్రభుత్వ దళితుల కుటుంబాలకు రూ.10 లక్షలు ఇస్తుందని చెప్పారు. వారు అణగారిన వారు, సంవత్సరాలుగా బానిసలుగా ఉన్నందుకు ఆయన ఇస్తున్నారని చెప్పారు. 
 
అయితే, బడుగు బలహీన వర్గాల అభ్యున్నతి కోసం బాబాసాహెబ్ రాజ్యాంగాన్ని రచించారని చెప్పారు. ప్రస్తుతం దేశంలో అమల్లో ఉన్న రాజ్యాంగాన్ని మార్చాలని కేసీఆర్ కోరడం విడ్డూరంగా ఉందన్నారు. ఏప్రిల్ 14వ తేదీన అంబేద్కర్ జయంతి సందర్భంగా 2019 ఏప్రిల్ 13వ తేదీన హైదరాబాద్‌ పంజాగుట్ట చౌరస్తా వద్ద అంబేద్కర్ విగ్రహాన్ని చేశామని గుర్తుచేశారు.
 
అంబేద్కర్ రచించిన రాజ్యాంగంలోని ఆర్టికల్ 3 ప్రకారమే మాకు తెలంగాణ రాష్ట్ర వచ్చిందని వీహెచ్ గుర్తుచేశారు. ఇపుడు మీరు రాజ్యాంగాన్ని మార్చాలి, అంబేద్కర్ వారసత్వాన్ని తొలగించాలనుకుంటున్నారు. ప్రజలు తీవ్ర అగ్రహంతో ఉన్నారని, కేసీఆర్ పెద్ద తప్పు చేస్తున్నారన్నారు. 

సంబంధిత వార్తలు

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

రాగి రోటీలు తినడం వల్ల 9 ప్రయోజనాలు

అతిగా టీ తాగితే కలిగే అనారోగ్యాలు ఏమిటో తెలుసా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

తర్వాతి కథనం
Show comments