Webdunia - Bharat's app for daily news and videos

Install App

మటన్ ముక్క కోసం కొట్లాట.... ఎక్కడ?

Telangana
Webdunia
మంగళవారం, 26 ఫిబ్రవరి 2019 (13:32 IST)
మటన్ ముక్క కోసం రెండు వర్గాలవారు కొట్లాడుకున్నారు. పెళ్లి భోజనంలో మటన్ ముక్క వడ్డించలేదన్న కారణంతో వరుడు, వధువు తరపు బంధువులు ఘర్షణపడ్డారు. ఈ ఘటన తెలంగాణ రాష్ట్రంలోని కొత్తగూడెం జిల్లా బూర్గంపాడు మండలం ఉప్పుసాకలో జరిగింది. 
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, ఉప్పుసాక గ్రామానికి చెందిన ఆజ్మీరా కుమారి వివాహం కొత్తగూడేనికి చెందిన లావుడ్యా ప్రవీణ్‌ అనే యువకుడితో గత శుక్రవారం జరిగింది. ఈ పెళ్లి కూడా వధువు ఇంటివద్దే జరిగింది. వివాహం తర్వాత వధువు తరపువారు విందు భోజనం ఏర్పాటు చేశారు. ఈ విందులో మటన్ స్థానంలో చికెన్ వడ్డించారు. 
 
అయితే భోజనంలో మటన్ కూర వడ్డించాలని వరుడు తరపు వారు పట్టుబట్టారు. దీంతో వధువు, వరుడు తరపువారికి మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. మటన్‌ పెట్టే ఆర్థిక స్థోమత లేదని చికెన్‌తో సరిపెట్టుకోవాలని వధువు తరపువారు సర్దిచెప్పే ప్రయత్నం చేశారు. దీనికి వరుడు తరపు బంధువుల ససేమిరా అన్నారు. 
 
దీంతో ఇరు వర్గాల మధ్య ఘర్షణ చెలరేగింది. చివరకు ఇరువర్గాల మధ్య మాటమాట పెరిగి ఘర్షణ తలెత్తింది. భోజనాలు చేసేందుకు వేసిన కుర్చీలు తీసుకుని ఒకరిపై ఒకరు భౌతికదాడులకు దిగారు. సుమారు వందకుపైగా కుర్చీలు విరిగిపోగా.. 8 మందికి తీవ్ర గాయాలయ్యాయి. అనంతరం ఇరువర్గాల వారు పోలీస్‌ స్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదులు చేసుకున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

థియేటర్స్‌కి రమ్మని ఆడియన్స్‌ని రిక్వెస్ట్ చేస్తున్నా : త్రినాథరావు నక్కిన

ప్రియదర్శి, ఆనంది, సుమ కనకాల చిత్రం ప్రేమంటే థ్రిల్లింగ్ షెడ్యూల్ పూర్తి

సుధీర్ అత్తవర్ చిత్రం కొరగజ్జ తో ప్రయోగం చేయబోతున్న గోపీ సుందర్

గోపీచంద్‌, మీనాక్షి దినేష్ జంటగా బీవీఎస్ఎన్ ప్రసాద్ చిత్రం

Imanvi : నేను భారతీయ అమెరికన్‌ని, నా వాళ్ళు ఎవరూ సైన్యంలో లేరు : ఇమాన్వి స్పష్టీకరణ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తాటి ముంజలు వేసవిలో ఎందుకు తినాలి

హైదరాబాద్‌ కొండాపూర్‌లో 3వ స్టోర్‌ను ప్రారంభించిన టిబిజెడ్-ది ఒరిజినల్

సబ్జా గింజలు నీటిలో నానబెట్టి తాగితే...

Tulsi for Skin: తులసి ఆకులతో చర్మ సౌందర్యం.. పైసా ఖర్చు లేకుండా మెరిసిపోవచ్చు..

ఈ పండ్లు తిన్న వెంటనే మంచినీరు తాగితే ఏమవుతుందో తెలుసా?

తర్వాతి కథనం
Show comments