కేసీఆర్ బంపర్ ఆఫర్.. తెలంగాణ నిరుద్యోగులకు రూ.2 వేల భృతి

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ బంపర్ ఆఫర్ ప్రకటించారు. ఆ రాష్ట్రంలోని నిరుద్యోగులకు నెలవారీ భృతి కింద రూ.2 వేల చొప్పున ఆర్థిక సాయం అందజేయనున్నారు. ఇందుకోసం తెలంగాణ రాష్ట్ర ఆర్థిక శాఖ అధికారులు వి

Webdunia
శుక్రవారం, 23 ఫిబ్రవరి 2018 (14:50 IST)
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ బంపర్ ఆఫర్ ప్రకటించారు. ఆ రాష్ట్రంలోని నిరుద్యోగులకు నెలవారీ భృతి కింద రూ.2 వేల చొప్పున ఆర్థిక సాయం అందజేయనున్నారు. ఇందుకోసం తెలంగాణ రాష్ట్ర ఆర్థిక శాఖ అధికారులు విధివిధానాలపై ఆర్థికశాఖ కసరత్తు ప్రారంభించారు. 
 
ప్రతినెలా పింఛన్ తరహాలో నేరుగా నిరుద్యోగుల ఖాతాలో డబ్బులు జమ అయ్యేలా పథకం రూపొందిస్తున్నారు. దీనికి సంబంధించి ముఖ్యమంత్రి కేసీఆర్ త్వరలోనే ప్రకటన చేయనున్నారు. ఈ తరహా భృతి ఇచ్చినట్టయితే తెలంగాణ రాష్ట్రంలోని నిరుద్యోగులు సీఎం కేసీఆర్‌ను ఆకాశానికెత్తనున్నారు. 
 
ఇదిలావుండగా, రాష్ట్రంలో 2,630 రైతు వేదికలను నిర్మించాలని సీఎం ఆదేశించారు. రైతులకు నిరంతరం అవగాహన సదస్సులు నిర్వహించడానికి, వారు చర్చించుకుని అభిప్రాయాలను పంచుకోవడం కోసం ఈ వేదికలను వినియోగించాలని కోరారు. ప్రతి 5 వేల ఎకరాలకు ఒకటి చొప్పున రైతు వేదికలను వీలైనంత త్వరగా నిర్మించాలని ఆయన నిర్దేశించారు. 
 
రైతు సమన్వయ సమితుల నిర్మాణం, విధులు, బాధ్యతలు, ఈ నెల 25, 26 తేదీల్లో నిర్వహించనున్న ప్రాంతీయసదస్సుల గురించి గురువారం ప్రగతిభవన్‌లో సీఎం కేసీఆర్ సమీక్షించారు. రైతు వేదికల నిర్మాణానికి కావాల్సిన స్థలాలను జిల్లా కలెక్టర్లు ఎంపిక చేయాలని, ప్రభుత్వ భూముల నుంచి లేదా కొనుగోలు చేసి సేకరించాలని ఆదేశించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

వేధింపులు ధైర్యంగా ఎదుర్కోండి.. మహిళలకు ఐష్ పిలుపు

ఇకపై చిరంజీవి చారిటబుల్ ట్రస్ట్‌కు విదేశీ విరాళాలు

Naveen Polishetty : భీమవరం బల్మా గీతంతో గాయకుడిగా అదరగొట్టిన నవీన్‌ పొలిశెట్టి

Manoj: కంటెంట్ బాగుంటే ప్రేక్షకులు ఆదరిస్తున్నారు : మంచు మనోజ్

అశ్విని దత్ ప్రజెంట్స్ లో జయకృష్ణ ఘట్టమనేని చిత్రం శ్రీనివాస మంగాపురం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కాలిఫోర్నియా బాదంతో రెండు సూపర్‌ఫుడ్ రెసిపీలతో శీతాకాలపు ఆరోగ్యం ప్రారంభం

సీతాఫలం పండును ఎవరు తినకూడదు... తింటే విషం తీసుకున్నట్టే?

డయాబెటిస్ వున్నవారు తెలుసుకోవాల్సిన విషయాలు

Mint For Weight Loss: మహిళలు ఈజీగా బరువు తగ్గాలంటే.. పుదీనాను ఇలా వాడాలట..

భారతదేశంలో ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ బాధిత రోగులలో జీవించే అవకాశాలు కేవలం 3 శాతం మాత్రమే.. కానీ...

తర్వాతి కథనం
Show comments