Webdunia - Bharat's app for daily news and videos

Install App

కర్ణాటక ప్రజలు కర్రుకాల్చి వాత పెట్టినా భాజపాకి బుద్ధి రాలేదు: కేసీఆర్

Webdunia
శనివారం, 27 మే 2023 (18:54 IST)
భాజపాపై తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసారు. ఢిల్లీ ప్రభుత్వాన్ని కేంద్ర ప్రభుత్వం వేధిస్తోందనీ, ప్రభుత్వ అధికారులు ప్రభుత్వ అధీనంలో పనిచేయకుండా ఆర్డినెన్స్ తెచ్చి ఎమర్జెన్సీని తలపిస్తోందని ఆరోపించారు. ఆర్డినెన్స్ విషయమై సుప్రీంకోర్టు సైతం తప్పని చెప్పినా భాజపా పట్టించుకోవడం లేదన్నారు.
 
ప్రభుత్వం తెచ్చిన ఈ ఆర్డినెన్సును ఉపసంహరించుకునే వరకూ తాము పోరాడతామన్నారు. ఈ విషయమై మద్దతు కోరుతూ ఢిల్లీ సీఎం కేజ్రీవాల్, పంజాబ్ ముఖ్యమంత్రి మాన్ శనివారం కేసీఆర్‌తో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా కేసీఆర్ మాట్లాడుతూ... రెండు జాతీయ పార్టీలను మట్టికరిపించి అరవింద్ కేజ్రీవాల్ అద్భుత విజయాన్ని కైవసం చేసుకున్నారనీ, ఐతే లెఫ్టినెంట్ గవర్నర్ ద్వారా కేంద్రంలోని భాజపా ప్రభుత్వం వేధిస్తోందని మండిపడ్డారు. గవర్నర్లు భాజపా స్టార్ క్యాంపెయినర్లుగా మారారనీ, కర్నాటక ప్రజలు కర్రుకాల్చి వాత పెట్టినా భాజపాకి బుద్ధి రాలేదని అన్నారు. త్వరలోనే భాజపాకి దేశం యావత్తు గుణపాఠం చెబుతుందని అన్నారు కేసీఆర్.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

'హరిహర వీరమల్లు' సినిమా టిక్కెట్ ధరల తగ్గింపు

వెంకన్న స్వామి దయ, ప్రేక్షకుల ఆశీస్సులతో ‘కింగ్డమ్’ చిత్రంతో ఘన విజయం : విజయ్ దేవరకొండ

ఢిల్లీలోని తెలుగు ప్రజల కోసం 'హరిహర వీరమల్లు' ప్రత్యేక ప్రదర్శనలు..

శ్రీవారి సేవలో 'కింగ్డమ్' చిత్ర బృందం

Hari Hara Veera Mallu: ఢిల్లీ ఏపీ భవన్‌లో రెండు రోజుల పాటు హరిహర వీరమల్లు చిత్ర ప్రదర్శన

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

Snacks: బరువు తగ్గాలనుకునే మహిళలు హెల్దీ స్నాక్స్ తీసుకోవచ్చు.. ఎలాగంటే?

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

ఒక్క ఏలుక్కాయను రాత్రి తిని చూడండి

తర్వాతి కథనం
Show comments