Webdunia - Bharat's app for daily news and videos

Install App

తెలంగాణాలో కఠిన ఆంక్షలు ... కీలక నిర్ణయం తీసుకోనున్న సీఎం కేసీఆర్

Webdunia
ఆదివారం, 16 జనవరి 2022 (11:49 IST)
తెలంగాణ రాష్ట్రంలో కరోనా వ్యాప్తి అధికంగా ఉంది. రోజురోజుకూ పాజిటివ్ కేసుల సంఖ్య విపరీతంగా పెరిగిపోతోంది. దీంతో కరోనా వ్యాప్తి నియంత్రణ కోసం ప్రభుత్వం కఠిన ఆంక్షలు అమలు చేసేందుకు మొగ్గు చూపుతోంది. ఇప్పటికే వైద్య ఆరోగ్య శాఖ అధికారుల సూచనలతో ఈ నెలాఖరు వరకు రాష్ట్రంలోని అన్ని విద్యా సంస్థలలకు సెలవులు ప్రకటించారు. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్ అధికారికంగా ప్రకటన చేశారు. 
 
ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి కేసీఆర్ తాజా పరిస్థితులపై సీఎస్‌తో సమీక్ష జరిపారు. ఇందుకోసం ఆయన మరోమారు మంత్రివర్గాన్ని ఏర్పాటు చేసి కీలక నిర్ణయం తీసుకునే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. ముఖ్యంగా, కఠిన ఆంక్షలను అమలు చేయాలని భావిస్తున్నారు. సోమవారం మధ్యాహ్నం 2 గంటలకు రాష్ట్ర మంత్రివర్గం సీఎం అధికారిక నివాసమైన ప్రగతి భవన్‌లో జరుగనుంది. 
 
ఇందులో దేశంలో, రాష్ట్రంలో నెలకొన్న కరోనా పరిస్థితులపై విపులంగా చర్చించనున్నారు. కరోనా కట్టడికి తీసుకోవాల్సిన చర్యలపై చర్చించి ఓ నిర్ణయానికి రానున్నారు. ఇప్పటికే విద్యా సంస్థల సెలవులు పొడిగించిన నేపథ్యంలో ఓ వైపు కోవిడ్ కట్టడికి ఇతర రాష్ట్రాలు రాత్రిపూట కర్ఫ్యూ, వీకెండ్ లాక్డౌన్ విధిస్తున్న తెల్సిందే. ఈ నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందన్న దానిపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అరుణాచలంలో ఆ హీరో - హీరోయిన్ చేసిన పనికి మండిపడుతున్న భక్తులు!!

టాలీవుడ్‌లో విషాదం : నిర్మాత ముళ్లపూడి బ్రహ్మానందం కన్నుమూత

ఆదిత్య 369 రీ-రిలీజ్... ఏప్రిల్ 4న విడుదల.. ట్రైలర్ అదుర్స్

VV Vinayak: వినాయక్ క్లాప్ తో ప్రారంభమైన ఎం ఎస్ ఆర్ క్రియేషన్స్ చిత్రం

లగ్గం టైమ్‌ షూటింగ్ పూర్తి, సమ్మర్ కానుకగా విడుదల

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బెల్లీ ఫ్యాట్ కరిగిపోయి అధికబరువు తగ్గిపోవాలంటే?

దగ్గుతో రక్తం కక్కుకుంటున్నారు, రష్యాలో కొత్తరకం వైరస్, వేలల్లో రోగులు

అలాంటి వేరుశనక్కాయలు, ఎండుమిర్చి తింటే కేన్సర్ ప్రమాదం

Hot Water: వేసవిలో వేడి నీళ్లు తాగవచ్చా? ఇది ఆరోగ్యానికి మంచిదా?

వేసవి ఎండల్లో ఈ 9 పండ్ల రసాలు తాగితే?

తర్వాతి కథనం
Show comments