Webdunia - Bharat's app for daily news and videos

Install App

రెండో రోజూ వేడెక్కిన తెలంగాణ అసెంబ్లీ... ఆరుగురు కాంగ్రెస్​ సభ్యుల సస్పెషన్​

Webdunia
ఆదివారం, 8 మార్చి 2020 (12:12 IST)
బడ్జెట్​ సమావేశాల రెండో రోజు అసెంబ్లీలో వాడీవేడి చర్చ జరిగింది. గవర్నర్​ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంలో భాగంగా.. చేపట్టిన చర్చలో కాసేపు గందరగోళం నెలకొంది.

ఇదే సమయంలో అధికార ప్రతిపక్ష నేతల మధ్య మాటల యుద్ధం నెలకొంది. సభా వ్యవహరాలకు అడ్డుపడుతున్నారంటూ ఆరుగురు కాంగ్రెస్​ సభ్యులను సభ నుంచి ఒక రోజు సస్పెండ్​ చేశారు. రెండో రోజు అసెంబ్లీ సమావేశంలో భాగంగా ఆసక్తికర పరిణామాలు చోటు చేసుకున్నాయి.

గవర్నర్​ ప్రసంగానికి ధన్యావాదాలు తెలిపే తీర్మానంపై చర్చ ప్రారంభమవ్వగా.. కాంగ్రెస్​ సభ్యులు గవర్నర్​ ప్రసంగాన్ని వ్యతిరేకించారు. ప్రసంగం ఆసాంతం ప్రభుత్వాన్ని పోగడటమే సరిపోయిందని ములుగు ఎమ్మెల్యే సీతక్క విమర్శించారు.

గవర్నర్​తో అబద్ధాలు.. రాష్ట్ర ప్రభుత్వం గవర్నర్ తమిళిసైతో అబద్ధాలు చెప్పించారని కమలం పార్టీ ఎమ్మెల్యే రాజాసింగ్​ ఆరోపించారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీల్లో ఒక్కదానిని కూడా అధికార పార్టీ నిలబెట్టుకోలేకపోయిందని తెలిపారు.

బడ్జెట్​ సమావేశాల్లో ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతామని రాజాసింగ్​ స్పష్టం చేశారు. సీఏఏపై తర్వాత చర్చిద్దాం.. చర్చలో ఎంఐఎం శాసనసభాపక్ష నేత అక్బరుద్దీన్.. సీఏఏ అంశాన్ని ప్రస్తావించారు.

ఈ అంశంపై సభలో చర్చ జరగాలని కోరారు. దీనిపై స్పందించిన సీఎం కేసీఆర్ ఇది సమయం కాదని హితవు పలికారు. సీఏఏపై తర్వాత చర్చిద్దామని స్పష్టం చేశారు. కోమటిరెడ్డి ఆగ్రహం.. కాంగ్రెస్​ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్​ రెడ్డి గవర్నర్​ ప్రసంగంపై నిప్పులు చెరిగారు.

ఈక్రమంలోనే అధికార, ప్రతిపక్ష ఎమ్మెల్యేల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. కాంగ్రెస్​ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్​రెడ్డి మాట్లాడుతుండగా మంత్రి ప్రశాంత్​రెడ్డి అడ్డుపడ్డారు. ప్రజల తరపున ప్రశ్నించే గొంతును నొక్కేస్తున్నారని రాజగోపాల్​రెడ్డి మండిపడ్డారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

8కె. ఫార్మెట్ లో ఎన్.టి.ఆర్., రాజమౌళి సినిమా యమదొంగ రిరిలీజ్

మౌత్ పబ్లిసిటీ పై నమ్మకంతో చౌర్య పాఠం విడుదల చేస్తున్నాం : త్రినాథరావు నక్కిన

జూ.ఎన్టీఆర్ ధరించిన షర్టు ధర రూ.85 వేలా?

సైన్స్ ఫిక్షన్ యాక్షన్ చిత్రంగా కిచ్చా సుదీప్ తో బిల్లా రంగ బాషా ప్రారంభం

తన ముందే బట్టలు మార్చుకోవాలని ఆ హీరో ఇబ్బందిపెట్టేవాడు : విన్సీ అలోషియస్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వేసవి కాలంలో రాత్రిపూట స్నానం చేయడం మంచిదా?

నిద్రలేమి సమస్య వున్నవారు ఇవి తినాలి

బెల్లం - తేనె.. ఈ రెండింటిలో ఏది బెటర్!

కిడ్నీల్లో రాళ్లు ఎలా చేరుతాయి?

ఇంగ్లీష్ టీచింగ్ పద్ధతి అదుర్స్.. ఆ టీచర్ ఎవరు..? (video)

తర్వాతి కథనం
Show comments