Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

అక్రమ లేఔట్లను నిలువరించేందుకు తెలంగాణలో రిజిస్ట్రేషన్లు బంద్!

అక్రమ లేఔట్లను నిలువరించేందుకు తెలంగాణలో రిజిస్ట్రేషన్లు బంద్!
, సోమవారం, 2 మార్చి 2020 (05:21 IST)
అనుమతి లేకుండా భవనాలు, ఇళ్ల స్థలాలు కొన్న వారికి సబ్​రిజిస్ట్రార్లు రిజిస్ట్రేషన్లు ఆపేశారు. పురపాలక శాఖ మంత్రి ఆదేశానుసారం, మున్సిపల్​ కమిషనర్ల లేఖల ఆధారంగా ఈ నిర్ణయం తీసుకున్నట్టు రిజిస్ట్రార్లు పేర్కొంటున్నారు.

అక్రమ లేఔట్లను నిలువరించేందుకు ఇది ఓ మంచి తరుణం అని ప్రజలు భావిస్తున్నారు. రాష్ట్రంలోని చాలా మున్సిపాలిటీల్లో అక్రమ లేఔట్ల స్థలాలు, భవనాలకు రిజిస్ట్రేషన్​లు నిలిపివేశారు.

కమిషనర్ల లేఖల ఆధారంగా సబ్​ రిజిస్ట్రార్లు తక్షణమే అమలు చేస్తున్నారు. ప్రస్తుతానికి దాదాపు 30 మున్సిపాలిటీల్లో ఈ పరిస్థితి ఉంది. కమిషనర్ల నుంచి లేఖలు అందిన వెంటనే మిగిలిన చోట్లా అమలు చేయనున్నారు.

దీని వల్ల అక్రమ లేఔట్ల్​లు- అనధికారిక భవన నిర్మాణాల సంఖ్య గణనీయంగా తగ్గిపోతుందని అధికారులు భావిస్తున్నారు. లేఖలు రాశారు కొత్త మున్సిపల్​ చట్ట ప్రకారం పురపాలక సంఘాల పరిధిలో అనుమతి లేకుండా వేసిన వెంచర్లలో స్థలాలను అనధికారిక భవనాలను రిజిస్ట్రేషన్​ చేయకూడదు.

పక్కాగా నిషేధం అమలు చేయాలి. పురపాలక శాఖ మంత్రి కేటీఆర్​ కూడా ఈ విషయంలో కఠినంగా ఉండమని కమిషనర్లను కోరారు. దానితో కొంతమంది ఫిబ్రవరి 22 నుంచే రంగంలోకి దిగారు. ఆయా జిల్లాల రిజిస్ట్రేషన్​ అధికారులకు లేఖలు రాశారు.

'మా పట్టణ పరిధిలో ఫలానా ఏరియాలో అక్రమ లేఔట్ల్ ఉంది. ఫలానా ప్రాంతంలో అక్రమ నిర్మాణాలు చేశారు. సంబంధిత సర్వే నంబరులో ఇళ్లు, స్థలాలు రిజిస్టర్​ చేయొద్దు' అని అందులో స్పష్టంగా పేర్కొంటున్నారు. ఇలా లేఖలు అందుకున్న అనేకమంది సబ్​రిజిస్ట్రార్లు తక్షణం ఆచరణలో పెట్టారు.

కొంతమంది స్థానిక నాయకులు వారిపై ఒత్తిడి తెస్తున్నా ఎంతో స్థిరంగా ఉంటున్నారని తెలిసింది. మున్సిపల్​ చట్టంలో ఉన్న విధంగానే తాము వ్యవహరిస్తున్నామని రిజిస్ట్రేషన్​ శాఖ అధికారి ఒకరు తెలిపారు.

ఎన్నెన్ని అక్రమ లేఔట్​లో.. రాష్ట్రంలోని అనేక పురపాలక సంఘాల పరిధిలో వందలాది అక్రమ లేఔట్లు ఉన్నట్లు అధికారులు చెబుతున్నారు. కొన్ని చోట్ల వేలాదిగా ఇళ్ల నిర్మాణాలు కూడా జరిగిపోతున్నాయి.

గత నెల వరకు ఈ నిర్మాణాలకు, స్థలాలకు ఎటువంటి ఇబ్బంది లేకుండా రిజిస్ట్రేషన్లు జరిగాయి. తాజాగా ఆగిపోవడం వల్ల అక్రమ లేఔట్లలో ఇళ్లు, స్థలాలను కొన్న వేలాది మంది లబోదిబోమంటున్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

పింఛన్ దారుల కళ్ళల్లో సంతృప్తి: మంత్రి పేర్ని నాని