తెలంగాణలో కరోనా తగ్గుముఖం.. మే మొదటి వారంలో ఇంటర్ పరీక్షలు

Webdunia
గురువారం, 21 జనవరి 2021 (10:03 IST)
తెలంగాణలో కరోనా కేసులు తగ్గుముఖం పట్టాయి. తాజాగా గడిచిన 24 గంటల్లో 226 కరోనా కేసులు నమోదు కాగా.. ఒకరు మృతి చెందారు. దీంతో మొత్తం ఇప్పటి వరకు రాష్ట్రంలో పాజిటీవ్ కేసుల సంఖ్య 2,92,621కి చేరింది. 1584 మంది మరణించారు. 
 
ప్రస్తుతం తెలంగాణలో 3,920 యాక్టివ్ కేసులుండగా.. చికిత్స నుంచి కోలుకుని 2,86,894 మంది డిశ్చార్జ్ అయ్యారని రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ గురువారం ఉదయం విడుదల చేసిన హెల్త్ బులిటెన్‌లో పేర్కొంది. కాగా కొత్తగా జీహెచ్‌ఎంసీ పరిధిలో 54 కరోనా కేసులు నమోదయ్యాయి.
 
తెలంగాణలో ఇంటర్ పరీక్షలు మే మొదటి వారంలో నిర్వహించాలని అధికారులు భావిస్తున్నట్ట్టు చెబుతున్నారు. ఫస్ట్ ఇయర్ ఫెయిల్ అయిన విద్యార్ధులను ప్రమోట్ చేయాలనే ఆలోచనలో ఇంటర్ బోర్డు ఉందని అంటున్నారు.
 
ప్రభుత్వానికి ఈ మేరకు ఇంటర్ బోర్డ్ ప్రతి పాదనలు పంపినట్టు చెబుతున్నారు. ఎంసెట్ సిలబస్ ఖరారు చేసేందుకు వారంలో ఉన్నత విద్యామండలి తో ఇంటర్ అధికారుల భేటీ ఉండే అవకాశం ఉందని అంటున్నారు.
 
అకడమిక్‌ క్యాలెండర్‌ లో ఈ మేరకు జరిగే మార్పులతో ఫిబ్రవరి 1 నుంచి మొత్తం 68 రోజులపాటు ప్రత్యక్ష తరగతుల నిర్వహణకు వీలుపడనుంది. ఈ 68 రోజుల్లోనే సిలబస్‌, రివిజన్‌ పూర్తిచేయడానికి అధికారులు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. 
 
ప్రభుత్వం నుండి అనుమతి రాగానే రెండు మూడు రోజుల్లో తేదీలు ఖరారవుతాయని సమాచారం. తొలుత ఏప్రిల్‌లో పరీక్షలు నిర్వహించాలని భావించినా, అదే మాసంలో అత్యధికంగా 10 రోజులు సెలవులుండటం, అంతే కాక జేఈఈ మెయిన్స్‌ పరీక్షలతో నిర్ణయాన్ని మార్చుకున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

P.G. Vinda: సినిమాటికా ఎక్స్ పో 3వ ఎడిషన్ లో AI సెషన్స్ వుంటాయి : పి.జి. విందా

Rahul Ravindran: ఓజీలో ఆయన చెప్పగానే నటించా, హను రాఘవపూడి పిలిస్తే వెళ్తా : రాహుల్ రవీంద్రన్

Yash: రాకింగ్ స్టార్ య‌ష్ మూవీ టాక్సిక్: విడుదలపై రూమ‌ర్స్‌కి చెక్

Avika Gor : అవిక గోర్ నటిస్తున్న రొమాంటిక్ థ్రిల్లర్ అగ్లీ స్టోరీ

Samantha: ది గాళ్ ఫ్రెండ్ చిత్రానికి సమంత ను కాదని రష్మిక ను ఎందుకు తీసుకున్నారో తెలుసా...

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

నాట్స్ విస్తరణలో మరో ముందడుగు, షార్లెట్ చాప్టర్ ప్రారంభించిన నాట్స్

కార్తీక మాసంలో నేతి బీరకాయ పచ్చడి ఎందుకు తింటారు? ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి?

ప్రపంచ స్ట్రోక్ దినోత్సవం వేళ తెలంగాణలో అత్యంత అధునాతన రోబోటిక్స్- రికవరీ ల్యాబ్‌ను ప్రారంభించిన హెచ్‌సిఎహెచ్

మారుతున్న రుతువులు: ఈ సమయంలో రోగనిరోధక శక్తిని పెంచుకోవడం ఎలా?

పింక్ రిబ్బన్‌కు మించి: అపోహలు పటాపంచలు, జీవితాల్లో స్ఫూర్తి

తర్వాతి కథనం
Show comments