Webdunia - Bharat's app for daily news and videos

Install App

తీన్మార్ మల్లన్న ఓడిపోవడంతో యువకుడి ఆత్మహత్య

Webdunia
ఆదివారం, 21 మార్చి 2021 (14:18 IST)
తెలంగాణ రాష్ట్రంలో రెండు పట్టభద్రుల నియోజకవర్గాలకు ఎన్నికలు జరిగాయి. ఈ ఎన్నిల్లో తెరాస తరపున పోటీ చేసిన వాణీదేవి, పల్లా రాజేశ్వర్ రెడ్డిలు విజయం సాధించారు. అయితే, ఈ ఎన్నికల్లో తీన్మార్ మల్లన్న కూడా పోటీ చేశారు. కానీ ఆయన ఓడిపోయాడు. ఈ ఓటమిని జీర్ణించుకోలేక మర్రిగూడ మండలం, లంకలపల్లిలో ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. ఆదివారం ఉదయం పురుగులమందు తాగి శ్రీశైలం అనే యువకుడు ప్రాణాలు తీసుకున్నాడు. తీన్మార్ మల్లకు మద్దతుగా ప్రచారం చేశాడు. అయితే కొన ఊపిరితో ఉన్నట్లు భావించిన కుటుంబ సభ్యులు నల్గొండకు తరలించారు. అప్పటికే చనిపోయినట్లు వైద్యులు ధృవీకరించారు. 
 
ఈ ఘటనపై స్పందించిన తీర్మాన్ మల్లన్న మీడియాతో మాట్లాడుతూ, చాలా బాధాకరమైన విషయమన్నారు. తమ్ముడు శ్రీశైలం తనతోపాటు పాదయాత్రలో పాల్గొన్నాడని, తన టీమ్‌లో ఒక సభ్యుడుగా పనిచేశాడన్నారు. ఎట్టి పరిస్థితిలో రాష్ట్రంలో మార్పు తీసుకురావాలని తిరిగిన సోదరుడు దూరం కావడం చాలా బాధగా ఉందన్నారు. గెలుపోటములు సహజమని, ఎవరూ ఇలాంటి ప్రయత్నాలు చేయవద్దని మల్లన్న విజ్ఞప్తి చేశారు. 
 
'సోదరులారా రాబోయేది మన రాజ్యమే.. ఎవరూ ఆధైర్యపడకండి.. సూసైడ్ చేసుకోవాల్సింది మనంకాదు.. ప్రజలకు దూరంగా ఉన్న రాజకీయ పార్టీలు సూసైడ్ చేసుకోవాలి.. నా మీద అభిమానం ఉన్న సోదరులు ఎవరూ ఇలాంటి పనులు చేయవద్దని' కోరారు. శ్రీశైలం కుటుంబానికి అండగా ఉంటామని తీన్మార్ మల్లన్న స్పష్టం చేశారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Dil Raju: గద్దర్ అవార్డ్ ఫంక్షన్ హిట్టా - ఫ్లాపా - ఏవరేజా? స్పెషల్ స్టోరీ

Raja sab: గత ఏడాది మా చిత్రాలు నిరాశపరిచాయి : టీజీ విశ్వప్రసాద్

Bengal Files: రాజకీయ వ్యవస్థను ప్రశ్నించిన ది బెంగాల్ ఫైల్స్ టీజర్

'కన్నప్ప' చిత్రాన్ని వీక్షించిన రజనీకాంత్

అర్జున్, జగపతి బాబు, వేణు ఎంటర్‌టైనర్ హనుమాన్ జంక్షన్ రీ-రిలీజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తాటి కల్లు ఆరోగ్య ప్రయోజనాలు

Night shifts: నైట్ షిఫ్ట్ చేస్తున్న మహిళలకు ఆస్తమా వచ్చే ప్రమాదం ఎక్కువ

ఉదయాన్నే గోరువెచ్చని మంచినీటిని తాగితే?

జామ ఆకుల టీ తాగితే?

ఇది షాకింగ్ వార్తే.. ఆల్కహాల్‌ కాలేయ వ్యాధులు.. మృతుల్లో మహిళలే ఎక్కువ

తర్వాతి కథనం
Show comments