Webdunia - Bharat's app for daily news and videos

Install App

విద్యార్థిని ఆత్మహత్య.. ఎంసెట్‌లో మార్కు తక్కువొచ్చాయని?

Webdunia
గురువారం, 26 ఆగస్టు 2021 (09:18 IST)
తెలంగాణలో బుధవారం ఎంసెట్ ఫలితాలు విడుదలయ్యాయి. అయితే ఎంసెట్ లో అర్హత సాధించలేదని నల్గొండకు చెందిన ఓ విద్యార్థిని ఆత్మహత్య చేసుకుంది. నల్గొండ జిల్లా కనగల్ మండలం శాబ్దుల్లా పూర్ గ్రామానికి చెందిన స్నేహ రెడ్డి అనే విద్యార్థిని నల్గొండ లోని ఒక ప్రైవేట్ కాలేజీలో ఇంటర్ పూర్తి చేసింది. 
 
ఎంసెట్ లో అర్హత సాధించకపోవడంతో మనస్థాపానికి గురైన విద్యార్థిని బుధవారం ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఫ్యాన్ కు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది.
 
“అమ్మా నాన్నా నన్ను క్షమించండి. మీకు నా ముఖం చూపించలేను.. మీరు నా మీద చాలా ఆశలు పెట్టుకున్నారు. కానీ నిలబెట్టుకోలేక పోయాను. అందుకే మిమ్మల్ని వదిలి వెళుతున్నాను.” అంటూ స్నేహ రెడ్డి సూసైడ్ నోట్ లో రాసి ఆత్మహత్య చేసుకుంది. 
 
స్నేహ రెడ్డి తల్లి ఏఎన్ఎం గా విధులు నిర్వహిస్తోంది. ఇంటికి వచ్చిన తల్లి ఫ్యాన్ కు కూతురు ఉరి వేసుకోవడం చూసి షాక్ అయింది. కూతురు ఆత్మహత్య తో తల్లి తండ్రులు గుండెలు పగిలేలా రోదిస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఓపికతో ప్రయత్నాలు చేయండి.. అవకాశాలు వస్తాయి : హీరోయిన్ వైష్ణవి

ది ట్రయల్: షాడో డిఈబిటి — గ్రిప్పింగ్ ప్రీక్వెల్ కాన్సెప్ట్ పోస్టర్

Ananya: స్మాల్ స్కేల్ ఉమెన్ సెంట్రిక్ సినిమాలకు అడ్రెస్ గా మారిన అనన్య నాగళ్ళ

మారుతీ చిత్రం బ్యూటీ నుంచి కన్నమ్మ సాంగ్ విడుదల

Shambhala: ఆది సాయికుమార్ శంబాల నుంచి హనుమంతు పాత్రలో మధునందన్‌

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మొలకెత్తిన బంగాళదుంపలు తింటే?

పిల్లలను స్క్రీన్ల నుంచి దూరంగా పెట్టండి.. అందుకు ఇలా చేయండి..

చిలగడదుంపలతో ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయా?

బరువును తగ్గించే ఉల్లిపాయలు.. ఎలా తీసుకోవాలి?

సూపర్ ఫుడ్ తింటే ఉత్సాహం ఉరకలు వేస్తుంది

తర్వాతి కథనం
Show comments