శ్రీశైలం జలవిద్యుత్ కేంద్రంలో భారీ అగ్నిప్రమాదం... 9 మంది గల్లంతు

Webdunia
శుక్రవారం, 21 ఆగస్టు 2020 (09:17 IST)
శ్రీశైలం జల విద్యుత్ ఉత్పత్తి కేంద్రంలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. ప్యానల్ సర్క్యూట్‌లో మంటలు చెలరేగడంతో ఈ ప్రమాదం సంభవించింది. ప్రస్తుతం ఈ విద్యుత్ కేంద్రం తెలంగాణ రాష్ట్ర పరిధిలోని టీఎన్‌జెన్‌కో ఆధీనలో ఉంది. 
 
నాగర్ కర్నూలు జిల్లా, అమ్రాబాద్ మండలం, దోమలపెంట శ్రీశైలం ఎడమ గట్టు పాతాళగంగ వద్ద ఉన్న జల విద్యుత్ కేంద్రంలో ఈ భారీ అగ్రి ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదం జరిగిన తర్వాత అక్కడ విధుల్లో నిమగ్నమైవున్నవారిలో దాదాపుగా పది మందివరకు గల్లంతయ్యారు. వారి ఆచూకీ కోసం సహాయక సిబ్బంది గాలిస్తున్నారు. 
 
కాగా, అగ్నిప్రమాదం జరిగిన సమయంలో 17 మంది వరకూ లోపల ఉన్నారని తెలుస్తోంది. ప్యానల్ సర్క్యూట్‌లో తొలుత మంటలు చెలరేగాయని అంటున్నారు. ప్రమాదం తర్వాత 8 మంది బయటకు పరుగులు తీయగా, డీఈ శ్రీనివాస్, ఏఈ సుందర్, ఉద్యోగులు మోహన్, కుమార్, సుష్మా, ఫాతిమా, వెంకట్ రావు, రాంబాబు, కిరణ్‌ల కోసం గాలిస్తున్నట్టు ఎన్డీఆర్ఎఫ్ రెస్క్యూ సిబ్బంది వెల్లడించారు. 
 
ఈ విషయం తెలుసుకున్న ఫైర్ సిబ్బంది వెంటనే రంగంలోకి దిగి, మంటలను అదుపు చేసే ప్రయత్నాలు ప్రారంభించారు. మంత్రి జగదీశ్వర్ రెడ్డి, టీఆర్ఎస్ విప్ గువ్వల బాలరాజు సహాయక చర్యలను పర్యవేక్షిస్తున్నారు. ఆ ప్రాంతంలో దట్టమైన పొగలు అలముకుని ఉండటంతో సహాయక చర్యలకు ఆటంకం కలుగుతోంది. మరిన్ని వివరాలు తెలియాల్సివుంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Pawan kalyan: మార్చి నెల ఉస్తాద్ గబ్బర్ సింగ్‌కు కలిసి వచ్చేలా వుంది

Sathya: నాగ చైతన్య చిత్రం వృషకర్మ లో సత్య లుక్‌

Srinath: మెన్షన్ హౌస్ మల్లేష్ నిజాయితీగా తీసిన సినిమా: శ్రీనాథ్ మాగంటి

Anantha Sriram: యూత్ కి ఒక యాంథమ్ లాగా ఉండాలనే రై రై రారా. పాట రాశాం : అనంత శ్రీరామ్

Bandla Ganesh: ఓటీటీ వద్దని సాయి, నితిన్‌కు ఫోన్‌ చేసి థియేటర్‌లో చేయమని చెప్పా : బండ్ల గణేష్‌

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

థైరాయిడ్ ఆరోగ్యం: పటిష్ఠ జీవక్రియ వైపు మీ మొదటి అడుగు

రంజాన్‌లో శక్తివంతం కావటానికి మార్గదర్శకాలు: ఉపవాసం ద్వారా చురుగ్గా...

పాలు తాగడం వల్ల ప్రయోజనాలు ఏమిటి?

మాన్యవర్ మోహే మేడ్ ఫర్ ఈచ్ అదర్‌తో రష్మిక మందన, విజయ్ దేవరకొండ

ఈ ఆహారాలతో శరీరంలోని చెడు కొవ్వు కరిగిపోద్ది

తర్వాతి కథనం
Show comments